Mantralayam Temple: రోడ్డు ప్రమాదంలో ఆర్గనైజర్ మృతి.. దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయిన 500 మంది భక్తులు!
Padayatra Organiser dies Near Mantralayam Temple: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. రాఘవేంద్రస్వామి దర్శనానికి కర్ణాటక నుంచి పాదయాత్రగా వచ్చిన 500 మంది భక్తులకు ఆర్గనైజర్గా వ్యవహరించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆర్గనైజర్ మృతి చెందడంతో అతడితో వచ్చిన 500 మంది భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…
కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరిగుప్ప మండలం కరూర్కు చెందిన వీరభద్రా రెడ్డి (40) పాదయాత్ర ఆర్గనైజర్. స్వగ్రామం కరూర్ నుంచి దాదాపుగా 500 మంది భక్తులను తీసుకుని.. మంత్రాలయానికి అతడు పాదయాత్రగా వస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శివారుకు అందరూ చేరుకున్నారు. మరో అర గంటలో రాఘవేంద్ర స్వామిని దర్శనం ఉందనగా విషాదం నెలకొంది. మంత్రాలయం శివారు తుంగభద్ర రైల్వే స్టేషన్ నుంచి పట్టణంలోకి వస్తున్న ఓ ఆటో.. వీరభద్రా రెడ్డిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్గనైజర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
Also Read: Pakistan Semi Finals Chances: పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. ఓ అద్భుతమే జరగాలి!ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే?
20 సంవత్సరాలుగా వీరభద్రా రెడ్డి సోదరుడు ప్రకాశ్ రెడ్డి ఈ పాదయాత్రను నిర్వహించారు. ప్రకాశ్ రెడ్డి మరణం అనంతరం గత 8 ఏళ్లుగా వీరభద్రా రెడ్డి పాదయాత్ర బాధ్యతను తీసుకున్నారు. బుధవారం ఊహించని ప్రమాదంలో అతడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. వీరభద్రా రెడ్డి మృతితో పాదయాత్ర భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోకుండానే స్వగ్రామానికి వెళ్లిపోయారు. వీరభద్రా రెడ్డికి భార్య జయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!