Mantralayam Temple: రోడ్డు ప్రమాదంలో ఆర్గనైజర్ మృతి.. దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయిన 500 మంది భక్తులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padayatra Organiser dies Near Mantralayam Temple: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. రాఘవేంద్రస్వామి దర్శనానికి కర్ణాటక నుంచి పాదయాత్రగా వచ్చిన 500 మంది భక్తులకు ఆర్గనైజర్గా వ్యవహరించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆర్గనైజర్ మృతి చెందడంతో అతడితో వచ్చిన 500 మంది భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…
కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరిగుప్ప మండలం కరూర్కు చెందిన వీరభద్రా రెడ్డి (40) పాదయాత్ర ఆర్గనైజర్. స్వగ్రామం కరూర్ నుంచి దాదాపుగా 500 మంది భక్తులను తీసుకుని.. మంత్రాలయానికి అతడు పాదయాత్రగా వస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శివారుకు అందరూ చేరుకున్నారు. మరో అర గంటలో రాఘవేంద్ర స్వామిని దర్శనం ఉందనగా విషాదం నెలకొంది. మంత్రాలయం శివారు తుంగభద్ర రైల్వే స్టేషన్ నుంచి పట్టణంలోకి వస్తున్న ఓ ఆటో.. వీరభద్రా రెడ్డిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్గనైజర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
Also Read: Pakistan Semi Finals Chances: పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. ఓ అద్భుతమే జరగాలి!ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే?
20 సంవత్సరాలుగా వీరభద్రా రెడ్డి సోదరుడు ప్రకాశ్ రెడ్డి ఈ పాదయాత్రను నిర్వహించారు. ప్రకాశ్ రెడ్డి మరణం అనంతరం గత 8 ఏళ్లుగా వీరభద్రా రెడ్డి పాదయాత్ర బాధ్యతను తీసుకున్నారు. బుధవారం ఊహించని ప్రమాదంలో అతడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. వీరభద్రా రెడ్డి మృతితో పాదయాత్ర భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోకుండానే స్వగ్రామానికి వెళ్లిపోయారు. వీరభద్రా రెడ్డికి భార్య జయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!