Cyber Crime: అచ్యుతాపురంలో సైబర్ డెన్ గుట్టురట్టు.. కాల్ సెంటర్ ముసుగులో..!
- అచ్యుతాపురంలో సైబర్ డెన్ గుట్టురట్టు
- కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా
- 33 మందిని అరెస్టు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా నడుస్తున్న భారీ సైబర్ డెన్ గుట్టు రట్టయింది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు రెండేళ్ల నుంచి కాల్ సెంటర్ నిర్వహిస్తూ.. అమెరికా సహా ఇతర దేశాల ప్రజలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని ఈ వ్యవహారం నిర్వహిస్తూ.. నెలకి 15-20 కోట్ల వరకు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్న 33 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.
ఎస్పీ తుహిన్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ… ‘అచ్యుతాపురం కేంద్రంగా నడుస్తున్న భారీ సైబర్ డెన్ గుట్టు రట్టు చేశాం. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో ఈ సైబర్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారు. గత రెండేళ్ల నుండి సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నెలకి 15-20 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుంది. అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 33 మందిని అదుపులోకి తీసుకున్నాం. ముంబై, రాజస్థాన్కు చెందిన ఇద్దరు ప్రధాన మేనేజర్లు నడిపిస్తున్నారు. మేఘాలయ, సిక్కిం, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఇందులో పని చేస్తున్నారు. అమెరికా పౌరులతో ఎలా మాట్లాడాలో రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెజాన్ ఈ మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, వాల్నట్, సూపర్ మార్కెట్ గిఫ్ట్ కూపన్ల పేరుతో నాలుగు దశల్లో ట్రాప్ చేస్తున్నారు’ అని తెలిపారు.
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
Also Read: High Court: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు
‘300 డాలర్ల నుంచి 3000 డాలర్ల వరకు కూపన్లు ఒక్కొక్కరికి అమ్ముతున్నారు. ఇందులో 200 నుండి 250 మంది కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. మొదట వీరందరికీ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. అపార్ట్మెంట్లకు 18 లక్షల రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. మూడు లక్షల నగదు, 300కు పైగా కంప్యూటర్స్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. అపార్ట్మెంట్స్ ఓనర్స్ పై కూడా విచారణ జరుపుతాం. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులను ఉద్యోగాల పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి అమెరికన్లతో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తున్నారు. అనంతరం అమెరికా ఈ-కామర్స్ పేరుతో అక్కడి పౌరులకు ఫోన్కాల్స్ చేస్తున్నారు. మీ పేరిట పార్సిల్ వచ్చిందని, దాన్ని అందజేయాలంటే కొంత డబ్బు చెల్లించాలంటూ అడుగుతున్నారు. పార్సిల్ వద్దనుకుంటే వివిధ కంపెనీల పేరిట ఆఫర్లు ఉన్నాయని చెబుతున్నారు. అదేవిధంగా కూపన్లు కూడా కొనుగోలు చేయాలని పేర్కొంటున్నారు. చివరికి డబ్బులు చెల్లించకపోతే ఇబ్బందులు పడతారంటూ వారి శైలిలో బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా ఒక్కొక్కరి నుంచి వారు భయపడే తీరుపై ఆధారపడి 200 నుంచి 3000ల డాలర్ల వరకు వసూలు చేస్తున్నారు’ అని ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?