Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story 33 Opposition Lok Sabha Mps Suspended For Disruptions 14 Were Suspended Earlier

Parliament: భద్రతా వైఫల్యంపై ఆందోళన.. ఒక్కరోజే 78 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు

Published Date :December 18, 2023 , 10:00 pm
By Mahesh Jakki
Parliament: భద్రతా వైఫల్యంపై ఆందోళన.. ఒక్కరోజే 78 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Parliament: పార్లమెంట్‌లో గతవారం నెలకొన్న భద్రతా వైఫల్యం ఘటనపై ఇరు సభల్లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో రాజ్యసభ, లోక్‌సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఈ క్రమంలో లోక్‌సభలో ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులపై స్పీకర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి సహా 33 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సోమవారం సస్పెండ్‌ చేశారు. ఇటీవలి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష సభ్యుల నిరంతర నిరసనల తర్వాత ఇది జరిగింది.

Read Also: Gyanvapi Case: జ్ఞానవాపి మసీదుపై సీల్డ్ నివేదికను కోర్టుకు సమర్పించిన పురావస్తు ప్యానెల్

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
  • Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..

సభలో గందరగోళం సృష్టించినందుకు గాను 33 మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) లోక్‌సభ నుంచి మిగిలిన శీతాకాల సమావేశాలకు సస్పెండ్ అయ్యారు. ఇటీవలి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష సభ్యుల నిరంతర నిరసనలు, ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన తరుణంలో వారిని స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఎంపీలలో కాంగ్రెస్‌కు చెందిన అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీకి చెందిన సౌగత రాయ్ ఉన్నారు. స్పీకర్ ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించగా.. స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. లోక్‌సభలో ఇప్పటికే 13 మంది విపక్ష ఎంపీలపై గత గురువారం సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సమావేశాల్లో ఇప్పటివరకు మొత్తం 46 మందిని లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేసినట్లయింది.

రాజ్యసభలో 48 మంది సస్పెండ్
రాజ్యసభలో 45మంది సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ ధన్‌కడ్‌ సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు జైరాం రమేశ్, రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌తో పాటు మొత్తం 45 మందిని సస్పెండ్ చేశారు. వీరిలో 34 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయగా.. మరో 11 మందిని ప్రివిలేజెస్‌ కమిటీ రిపోర్టు అందేవరు సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ తెలిపారు. ఇప్పటికే రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెసె ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌పై శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌ వేటు పడిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో 33 మంది, రాజ్యసభలో 45 మంది.. అంటే ఒక్కరోజులోనే 78 మంది విపక్ష ఎంపీ సస్పెండ్‌ అయ్యారు. గత వారం 14 మంది సస్పెండ్‌ అయ్యారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తంగా 90 మందికి పైగా విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు.

ఉభయసభలు రేపటికి వాయిదా.. 

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై కేంద్రం సభలో ప్రకటన చేయాలని పట్టుబడటంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ కార్యకలాపాలు స్తంభించటంతో రేపటికి వాయిదా పడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delhi
  • Lok Sabha MPs suspended
  • loksabha speaker
  • Parliament
  • Parliament Winter Session

తాజావార్తలు

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

  • Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!

  • Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్‌.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల

  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions