Bharat Jodo Yatra: 3వేల కిలోమీటర్లు పూర్తి.. నేడు యూపీలో పునఃప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తొమ్మిది రోజుల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్లో నేడు పునఃప్రారంభం కానుంది. 110 రోజులకు పైగా సాగిన యాత్రలో ఇప్పటివరకు 3వేల కిలోమీటర్లకు చేరుకుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. ఇది జమ్మూ కాశ్మీర్లో ముగుస్తుంది.
భారతదేశ చరిత్రలో ఏ భారతీయ రాజకీయ నాయకుడు చేయని.. కాలినడకన సాగిన సుదీర్ఘ పాదయాత్ర ఇదేనని కాంగ్రెస్ పేర్కొంది. జనవరి 26న శ్రీనగర్లో ముగిసే యాత్ర తర్వాత, యాత్ర సందేశాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో’ ప్రచారాన్ని ప్రారంభించనుంది.కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి దేశవ్యాప్తంగా ‘హాత్ సే హాత్ జోడో’ ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను సోదరి, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించారు.
Also Read
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
- EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
Siddeshwar Swami: జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి కన్నుమూత.. ప్రధాని సంతాపం
భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ రెండు నెలల పాటు ‘హత్ సే హాత్ జోడో ప్రచారాన్ని’ ప్రారంభిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా ప్రతిచోటా మహిళా సభ్యులతో పాదయాత్రలు, ర్యాలీలకు నాయకత్వం వహిస్తారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ‘భారత్ జోడో యాత్ర’ సందేశాన్ని వ్యాప్తి చేస్తారన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రజలపై, ముఖ్యంగా మధ్యతరగతిపై దాని ప్రభావంపై దృష్టి సారించి, మార్చిలో ప్రియాంక గాంధీ వాద్రా మహిళా కార్యకర్తలతో కవాతులకు నాయకత్వం వహిస్తారని సమాచారం. మహిళలకు సంబంధించిన ఇతర అంశాలు కూడా ప్రధాన ర్యాలీ పాయింట్గా ఉంటాయి.
తాజావార్తలు
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
-
CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!