Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు.. సురక్షితంగా బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్
Child Fell Into Borewell in Bihar: బీహార్ నలందా జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయి.వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు.శివమ్ అనే బాలుడిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని దాదాపు 5 గంటల పాటు శ్రమించి కాపాడారు. “ఒక బాలుడు బోరుబావిలో పడిపోయినట్లు మాకు సమాచారం అందింది. ఆ బాలుడిని రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నించాం. ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. పిల్లవాడు బతికే ఉన్నాడు, అతని అరుపులు వినిపిస్తున్నాయి.” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
Also Read: CM KCR: మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం.. కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఆ బాలుడి తల్లి పొలంలో పనిచేస్తుండగా.. ఆ బాలుడు బోరుబావి పక్కనే ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ వెళ్లి కాలుజారి బోరుబావిలో పడిపోయాడని బాలుడి తల్లి వెల్లడించింది. బోరుబావిలోకి ఆక్సిజన్ను అందిస్తున్నారు. బాలుడు 40 అడుగుల లోతులో ఇరుక్కున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ రైతు బోరు వేశాడని.. అందులో నీరు రాకపోవడంతో బోరును పూడ్చకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. చిన్నారిని బయటకు తీస్తే తక్షణ వైద్య సహాయం అందించడానికి ఆక్సిజన్ సౌకర్యాలతో కూడిన వైద్య బృందాలు కూడా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఓ రైతు నీళ్ల కోసం ఇక్కడ బోరుబావి తవ్వేందుకు యత్నించగా.. విజయవంతం కాలేదు. దీంతో వేరే ప్రాంతంలో మరో బోరుబావి తవ్వించాడని ఓ సీనియర్ అధికారి చెప్పారు. నీళ్లు పడకపోవడం వల్ల దానిని పూడ్చకుండా అలాగే వదిలేశాడు.
Also Read: Weather Update: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలోని ఒక గ్రామంలో బోరు బావిలో చిన్నారి పడింది. ఆ చిన్నారి బయటకు తీసేలోపే మరణించింది. జూన్ 6న మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలో 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడి రెండున్నరేళ్ల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!