Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు.. సురక్షితంగా బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Fell Into Borewell in Bihar: బీహార్ నలందా జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయి.వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు.శివమ్ అనే బాలుడిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని దాదాపు 5 గంటల పాటు శ్రమించి కాపాడారు. “ఒక బాలుడు బోరుబావిలో పడిపోయినట్లు మాకు సమాచారం అందింది. ఆ బాలుడిని రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నించాం. ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. పిల్లవాడు బతికే ఉన్నాడు, అతని అరుపులు వినిపిస్తున్నాయి.” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
Also Read: CM KCR: మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం.. కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఆ బాలుడి తల్లి పొలంలో పనిచేస్తుండగా.. ఆ బాలుడు బోరుబావి పక్కనే ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ వెళ్లి కాలుజారి బోరుబావిలో పడిపోయాడని బాలుడి తల్లి వెల్లడించింది. బోరుబావిలోకి ఆక్సిజన్ను అందిస్తున్నారు. బాలుడు 40 అడుగుల లోతులో ఇరుక్కున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ రైతు బోరు వేశాడని.. అందులో నీరు రాకపోవడంతో బోరును పూడ్చకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. చిన్నారిని బయటకు తీస్తే తక్షణ వైద్య సహాయం అందించడానికి ఆక్సిజన్ సౌకర్యాలతో కూడిన వైద్య బృందాలు కూడా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఓ రైతు నీళ్ల కోసం ఇక్కడ బోరుబావి తవ్వేందుకు యత్నించగా.. విజయవంతం కాలేదు. దీంతో వేరే ప్రాంతంలో మరో బోరుబావి తవ్వించాడని ఓ సీనియర్ అధికారి చెప్పారు. నీళ్లు పడకపోవడం వల్ల దానిని పూడ్చకుండా అలాగే వదిలేశాడు.
Also Read: Weather Update: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలోని ఒక గ్రామంలో బోరు బావిలో చిన్నారి పడింది. ఆ చిన్నారి బయటకు తీసేలోపే మరణించింది. జూన్ 6న మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలో 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడి రెండున్నరేళ్ల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!