Sadhus: బెంగాల్ లో సాధులపై దాడి.. టీఎంసీపై బీజేపీ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో గంగా సాగర్కు వెళ్తున్న సాధువులను చూసిన కొందరు పిల్లలను ఎత్తుకెళ్తారనుకొని చితకబాదారు. ఈ ఘటన పురులియా జిల్లాలో చోటు చేసుకుంది. అయితే, ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు సాధువులు మకర సంక్రాంతి సందర్భంగా బెంగాల్ లో నిర్వహించే గంగాసాగర్ మేళాకు కారులో వస్తున్నారు.. పురిలియా జిల్లాకు చేరుకున్నారు.. అక్కడ దారి తప్పిన వాళ్లు.. రూట్ గురించి ఇద్దరు మైనర్ బాలికలను అడిగారు.. అయితే వాళ్లు భయపడి కేకలు వేయడంతో స్థానకంగా ఉన్న కొందరు వచ్చి ఆ సాధువులను పట్టుకొని కొట్టారు.
Read Also: Allu Arjun: సోషియో ఫాంటసీ డ్రామాతో మాంత్రికుడు రెడీ?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సాధువులను రక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పురూలియా ఎస్పీ అభిజిత్ బెనర్జీ చెప్పుకొచ్చారు. సాధువులపై దాడి చేసిన వారిని గుర్తించాం.. వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. అక్కడ ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇక, ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ మమత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Winter Storm: అమెరికాలో తుఫాన్ దెబ్బకు రెండు వేల విమానాలు రద్దు..
రాష్ట్రంలో హిందూవులపై దాడి జరుగుతున్న కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా వ్యాఖ్యనించారు. ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. “మమతా బెనర్జీ మౌనంగా ఉండటం దారుణం! ఈ హిందూ సాధువులు మీకు కనిపించడం లేదా? అని విమర్శించారు. ఈ సంఘటనను 2020లో జరిగిన మహారాష్ట్రలోని పాల్ఘర్ మాబ్ లించింగ్తో పోల్చుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ పాలనలో షాజహాన్ షేక్ వంటి ఉగ్రవాదులకు రక్షణ లభిస్తుంది.. కానీ, సాధువులు మాత్రం చంపబడుతున్నారు అని అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు.
Outraged by the Purulia incident! Sadhus en route to Gangasagar brutally attacked—shocking evidence of deteriorating safety under TMC. Mamata's regime shields terrorists like Shahjahan Sheikh, while sadhus face brutal lynching. A grim reality for Hindus in Bengal. #SaveBengal https://t.co/0O6TJAbwqE
— Locket Chatterjee (@me_locket) January 12, 2024
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!