Madhya Pradesh : భూవివాదంలో ముగ్గురి హత్య.. ఇంటికి పిలిచి నరికి చంపారు
- మధ్యప్రదేశ్ లో ముగ్గురి దారుణ హత్య
- భూవివాదంలో కుటుంబ సభ్యులను చంపిన దుండగులు
- నిందితుల కోసం పోలీసుల గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని దామోహ్లో భూ వివాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 50 ఏళ్ల వ్యక్తి, అతని కుమారుడు, మేనల్లుడు మృతి చెందారు. ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎస్పీ శ్రుత్ కీర్తి సోమవంశీ తెలిపారు. ఈ ఘటన దామో దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బన్స్టార్ఖేడా గ్రామంలో చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపినట్లు అధికారి తెలిపారు. కాగా మూడో వ్యక్తిని పదునైన ఆయుధంతో నరికి చంపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భూమి వివాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Read Also:Railway : రాజమండ్రి మీదుగా నడిచే 26 రైళ్లు రద్దు
Also Read
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
- FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
మృతులను హోంగార్డు జవాన్ రమేష్ విశ్వకర్మ, అతని కుమారుడు ఉమేష్ విశ్వకర్మ (23), మేనల్లుడు రవి విశ్వకర్మ (24)గా గుర్తించారు. అగ్రిమెంట్ గురించి మాట్లాడేందుకు నిందితులు హోంగార్డు జవాన్ రమేష్ విశ్వకర్మను తమ ఇంటికి పిలిపించుకున్నట్లు సమాచారం. అయితే అక్కడే పదునైన ఆయుధంతో హత్య చేశాడు. కొంతసేపటికి ఉమేష్, రవి కూడా హత్యకు గురయ్యారు. ఇద్దరూ బైక్పై దామోహ్కు వెళుతుండగా మార్గమధ్యంలో కాల్పులు జరిపారు. గాయపడిన ఉమేష్, రవి మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా సంచలనం సృష్టించింది. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
Read Also:Hero Motocorp: జులై 1 నుంచి బైక్ ల ధరలు పెంచనున్న హీరో మోటోకార్ప్..త్వరగా కొనేయండి..
భూమి విషయంలో ఇరు కుటుంబాల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. గత నెలలో కూడా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగినట్లు టాక్. ప్రస్తుతం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. తెల్లవారుజామున ఇలాంటి ఘటనలతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!