UP: ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు కలకలం.. శవాల దగ్గర ఉన్న గ్లాస్లో ఏముందంటే..!
- ఉత్తరప్రదేశ్లోని మధురలో ఘోరం
- ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- సూసైడ్ నోట్పై పోలీసుల అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని మధురలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాపర్పూర్ గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయి ఉండడం తీవ్ర కలకలం రేపింది. భార్యభర్తలు, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్పై దుమారం.. రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
ఖాపర్పూర్ గ్రామంలో భర్త, భార్య, ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. అయితే ఐదుగురు శవాలుగా పడి ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పాల గ్లాస్ను స్వాధీనం చేసుకున్నారు. రాత్రిపూట విషం కలిపిన పాలు తీసుకుని సామూహిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి గోడపై ‘‘నేను నా సొంత ఇష్టానుసారంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను.’’ అని రాసి ఉంది. అయితే ఆత్మహత్యకు గల కారణం అస్పష్టంగా ఉందని అనుమానిస్తున్నారు. దీంతో ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Plane Crash: అమెరికాలో రోడ్డుపై కూలిన విమానం.. వీడియో వైరల్
ఖాపర్పూర్ గ్రామంలో నివసించే మనీష్ (35) ఒక రైతు. ఉదయం 10 గంటల ప్రాంతంలో మనీష్, అతని భార్య సీమ (32), ఐదేళ్ల కుమార్తె హానీ, నాలుగేళ్ల ప్రియాంషి, రెండేళ్ల కుమారుడు పంకజ్ మృతదేహాలు ఇంటి లోపల ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా ఐదుగురు విషం తాగి చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఇక మనీష్ సోదరులు ఇద్దరూ కూడా పక్కింట్లోనే నివాసం ఉంటున్నారు. ఇటీవలే మనీష్ తండ్రి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
-
Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?