ఉత్తరప్రదేశ్లోని మధురలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాపర్పూర్ గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయి ఉండడం తీవ్ర కలకలం రేపింది. భార్యభర్తలు, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్పై దుమారం.. రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఖాపర్పూర్ గ్రామంలో భర్త, భార్య, ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. అయితే ఐదుగురు శవాలుగా పడి ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పాల గ్లాస్ను స్వాధీనం చేసుకున్నారు. రాత్రిపూట విషం కలిపిన పాలు తీసుకుని సామూహిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి గోడపై ‘‘నేను నా సొంత ఇష్టానుసారంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను.’’ అని రాసి ఉంది. అయితే ఆత్మహత్యకు గల కారణం అస్పష్టంగా ఉందని అనుమానిస్తున్నారు. దీంతో ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Plane Crash: అమెరికాలో రోడ్డుపై కూలిన విమానం.. వీడియో వైరల్
ఖాపర్పూర్ గ్రామంలో నివసించే మనీష్ (35) ఒక రైతు. ఉదయం 10 గంటల ప్రాంతంలో మనీష్, అతని భార్య సీమ (32), ఐదేళ్ల కుమార్తె హానీ, నాలుగేళ్ల ప్రియాంషి, రెండేళ్ల కుమారుడు పంకజ్ మృతదేహాలు ఇంటి లోపల ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా ఐదుగురు విషం తాగి చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఇక మనీష్ సోదరులు ఇద్దరూ కూడా పక్కింట్లోనే నివాసం ఉంటున్నారు. ఇటీవలే మనీష్ తండ్రి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.