UP: ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు కలకలం.. శవాల దగ్గర ఉన్న గ్లాస్లో ఏముందంటే..!
- ఉత్తరప్రదేశ్లోని మధురలో ఘోరం
- ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- సూసైడ్ నోట్పై పోలీసుల అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని మధురలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాపర్పూర్ గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయి ఉండడం తీవ్ర కలకలం రేపింది. భార్యభర్తలు, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్పై దుమారం.. రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ఖాపర్పూర్ గ్రామంలో భర్త, భార్య, ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. అయితే ఐదుగురు శవాలుగా పడి ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పాల గ్లాస్ను స్వాధీనం చేసుకున్నారు. రాత్రిపూట విషం కలిపిన పాలు తీసుకుని సామూహిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి గోడపై ‘‘నేను నా సొంత ఇష్టానుసారంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను.’’ అని రాసి ఉంది. అయితే ఆత్మహత్యకు గల కారణం అస్పష్టంగా ఉందని అనుమానిస్తున్నారు. దీంతో ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Plane Crash: అమెరికాలో రోడ్డుపై కూలిన విమానం.. వీడియో వైరల్
ఖాపర్పూర్ గ్రామంలో నివసించే మనీష్ (35) ఒక రైతు. ఉదయం 10 గంటల ప్రాంతంలో మనీష్, అతని భార్య సీమ (32), ఐదేళ్ల కుమార్తె హానీ, నాలుగేళ్ల ప్రియాంషి, రెండేళ్ల కుమారుడు పంకజ్ మృతదేహాలు ఇంటి లోపల ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా ఐదుగురు విషం తాగి చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఇక మనీష్ సోదరులు ఇద్దరూ కూడా పక్కింట్లోనే నివాసం ఉంటున్నారు. ఇటీవలే మనీష్ తండ్రి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Astrology: మే 20 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!