BJP Manifesto: మేనిఫెస్టో కసరత్తుపై కీలక అప్డేట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేందుకు బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 400కు పైగా సీట్లు సాధించాలని కమలం పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీని బీజేపీ అధిష్టానం నియమించింది. ఇప్పటికే మేనిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేస్తోంది. పలు ఆకర్షిత పథకాలతో ముందుకు రావాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి కూడా పలు సూచనలు సేకరించింది.
ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి 3 లక్షలకు పైగా సూచనలు అందాయని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ప్రసాద్ మౌర్య తెలిపారు. మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు తర్వాత తొలిసారిగా సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ సభ్యుడు కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టో కోసం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి 3 లక్షలకు పైగా సూచనలు, సలహాలు వచ్చాయని వెల్లడించారు. ఇది దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయని తెలిపారు.
Also Read
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
ఇది కూడా చదవండి: CM YS Jagan: కదిరిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్
ప్రజల నుంచి తాము స్వీకరించిన సూచనలు, సలహాలపై ప్యానల్లో చర్చించి త్వరలోనే డాక్యుమెంట్ను ఖరారు చేస్తామని మౌర్య తెలిపారు. దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు తమకు సలహాలు, సూచనలు పంపించారన్నారు. నమో యాప్తో పాటు సలహాల కోసం ఏర్పాటు చేసిన నంబర్కు మిస్డ్కాల్ ఇచ్చిన వారి నుంచి సూచనలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. బీజేపీ ఏం చెబుతుందో అదే చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Josh Butler: పేరు మార్చుకున్న స్టార్ క్రికెటర్.. ఇక నుంచి ఏమని పిలువాలంటే..!
సీనియర్ బీజేపీ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీలో పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి నలుగురు ముఖ్యమంత్రులతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇక, ఈ కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్గా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కో-కన్వీనర్గా ఎంపికయ్యారు. మేనిఫెస్టో కమిటీలో సిక్కు, ముస్లిం, క్రిస్టియన్తో సహా మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Afghanistan: ఘోరం.. మందుపాతర పేలి 9 మంది చిన్నారుల మృతి
తాజావార్తలు
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
-
BMW Vision K18: భవిష్యత్ హై-పర్ఫార్మెన్స్ టూరింగ్ బైక్.. బీఎండబ్ల్యూ విజన్ K18 ఆవిష్కరణ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..