Site icon NTV Telugu

Indian Railways: భార్యాభర్తల గొడవతో రైల్వేకి రూ.3కోట్లు నష్టం.. ఏం జరిగిందంటే?

Indian Railways

Indian Railways

భార్యాభర్తల మధ్య గొడవ ఇంటి ఇంటి బయటకు రాకూడదని అంటారు. అలా వస్తే ఏ జరుగుతుందో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ మాత్ర భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంతో రైల్వేకి మూడు కోట్ల నష్టం వాటిల్లింది. అసలు ఏం జరిగిందంటే?

READ MORE: Modi-Advani: అద్వానీ ఇంటికి వెళ్లి బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ

వాస్తవానికి విశాఖపట్నంకు చెందిన వ్యక్తి (భర్త) ఓ స్టేషన్‌ మాస్టర్‌. డ్యూటీలో ఉండగా భార్యాభర్తల మధ్య ఫోన్‌లో గొడవ జరిగింది. దీంతో ఆ వ్యక్తి ఓ చేతిలో ఆఫీసు ఫోన్, మరో చేతిలో ఇంట్లో భార్యతో మాట్లాడుతున్నాడు. గొడవ జరుగుతున్న సమయంలో భార్య ఫోన్‌లో ఇంటికి రమ్మని, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పింది. భర్త సరే అన్నాడు. మరో చేతిలో ఉన్న ఫోన్‌లో అవతలి స్టేషన్ మాస్టర్ ఉన్నాడు. ఇతను సరే అనడంతో అవతలి స్టేషన్ మాస్టార్ రైలును వదిలి వెళ్లమని సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రైలు వెళ్లే మార్గంపై నిషేధం విధించారు. ఈ ఘటన తర్వాత రైల్వేకు ఏకంగా రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది.

READ MORE:Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై అజిత్ పవార్ అభ్యంతరం.. బీజేపీ కూటమిలో ఐక్యత లేదు..

అప్పటికే భార్యభర్తల మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. రైల్వేకు నష్టం వాటిల్లడంతో భర్తను సస్పెండ్ చేశారు. దీంతో భర్త విడాకులు కోరుతూ విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విడాకుల విషయం వెలుగులోకి రావడంతో విషయం తీవ్రరూపం దాల్చింది. భార్యాభర్తలిద్దరి నుంచి ఆరోపణలు రావడం మొదలయ్యాయి. భార్య తన ప్రేమికుడితో సంబంధం కొనసాగిస్తోందని భర్త ఆరోపిస్తున్నాడు. కాగా.. కట్నం కోసం అత్తమామలపై, కోడలితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నందుకు భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.

Exit mobile version