Parliament Session: నేడు రాజ్యసభ ముందుకు కీలకమైన మూడు బిల్లులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య అధినీయం బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. అయితే, ఈ మూడు బిల్లులు ఇవాళ రాజ్యసభ ముందు ప్రవేశ పెట్టనున్నారు. అయితే, ఈ సభలో కేంద్ర ప్రభుత్వానికి తగిన బలం లేదు.. దీంతో మెజారిటీ సభ్యుల నుంచి ఆమోదం పొందితేనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు.
Read Also: Bomb Blast: మహబూబాబాద్లో అర్ధరాత్రి బాంబ్ బ్లాస్టింగ్.. 25 ఇళ్లకు బీటలు!
Also Read
- AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
ఇక, ఆ తరువాత ఈ మూడు బిల్లులు చట్టంగా మారనున్నాయి. వీటిని ప్రస్తుతం ఉన్న ఐసీసీ, సీఆర్పీసీ చట్టాలలో ప్రత్యేక యాక్ట్గా పొందు పర్చారు. ఈ చట్టాలు నేరస్తులను శిక్షించడానికి కాదని.. బాధితులకు న్యాయం జరగడానికని కేంద్రం తెలిపింది. దేశంలో ఏదైనా అసాంఘీక ఘటనలు తలెత్తితే వేగంగా న్యాయం చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడుతాయని తెలిపారు. డిజిటల్, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న ఎవిడెన్స్ లను సైతం సాక్ష్యంగా పరిగణలోకి తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏదైనా నేరాలకు పాల్పడి ఇతర దేశాలకు పారిపోతే 90 రోజుల లోపు కోర్టు ముందు లొంగిపోయేలా ఈ చట్టాల్లో పొందుపర్చారు. ఇలా హాజరు కాని పక్షంలో వారి తరఫున ప్రభుత్వ న్యాయవాదిని పెట్టి తీర్పు వెల్లడిస్తారు. అలాంటి వారిని నేరస్తులుగా భావించి ఏ దేశంలో ఉన్నా తీసుకొచ్చి ఉరి శిక్ష వేస్తారు.
Read Also: Sandeep Reddy Vanga: ఏంటీ… ఈ ఇంటర్వ్యూ CGనా? మేము ఒరిజినల్ అనుకున్నామే
అలాగే, ఏదైనా కేసుల్లో దర్యాప్తు సంస్థలు చేపట్టే సోదాల్లో వీడియోగ్రఫీ చేయాలనే విషయాన్ని ఈ చట్టాల్లో పొందుపరిచారు. ఏదైనా తప్పు చేసినప్పటికీ నిరాధారంగా అరెస్ట్ చేసి పోలీ స్టేషన్లో పెట్టుకోవడానికి వీలు లేదంటూ వెల్లడించింది. ఆర్ధిక నేరస్తుల ఆస్తులను వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు ఆ డబ్బును మళ్లించేలా కొత్త ప్రతిపాదనను సైతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఏదైనా నేరాల్లో పట్టుబడ్డ వాహనాలను కోర్టు ద్వారా 30 రోజుల్లో అమ్మేయాలనే సంచలన నిర్ణయం తీసుకొచ్చారు. ఏడేళ్ల జైలు శిక్ష పడిన కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు సంస్థల ప్రమేయం తప్పనిసరి చేస్తూ ఈ మూడు కీలక బిల్లులను మోడీ సర్కార్ ప్రవేశ పెట్టింది.
తాజావార్తలు
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!