Delhi : ఢిల్లీలో విషాదం.. కాలువలో మునిగి చనిపోయిన ముగ్గురు ఫ్రెండ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : రాజధాని ఢిల్లీలోని హైదర్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సమీపంలోని మునాక్ కెనాల్లో మునిగి ముగ్గురు చిన్నారులు బుధవారం మృతిచెందారు. ముగ్గురు చిన్నారులు స్నానానికి కాల్వలోకి ప్రవేశించారని, అయితే ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగి చనిపోయారని అంచనా వేస్తున్నారు. చనిపోయిన ముగ్గురు చిన్నారులు స్నేహితులు. రామ నవమి నాడు పాఠశాలలు మూసివేయబడ్డాయి. దీంతో ముగ్గురూ కలిసి కాలువలో స్నానం చేయడానికి వెళ్లారు. కాని ఇది వారి చివరి రామ నవమి అని వారికి తెలియదు.
ముగ్గురు పిల్లలు ఢిల్లీలోని భల్స్వా నివాసితులు. మొదట ఓ చిన్నారి నీట మునిగిన వార్త అందింది. దీని తర్వాత డైవర్ల బృందం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కాలువలోకి దిగినప్పుడు, ఒకరు కాదు ముగ్గురు స్నేహితులు మునిగిపోయారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. డైవర్లు తొలుత కాలువ నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు పిల్లల వయస్సు దాదాపు 13 నుంచి 15 ఏళ్లు ఉంటుందని తెలిపారు.
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
Read Also:Mrunal Takur : జిమ్ లో తెగ కష్టపడుతున్న మృణాల్.. వీడియో వైరల్..
కాలువలో ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై రోహిణి జిల్లాలోని కేఎన్ కట్జూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదం చిన్నారులకు జరిగిందా లేక ఎవరైనా కుట్ర పన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు కూడా దీన్ని ప్రమాదంగానే పరిగణిస్తున్నారు.
ముగ్గురు చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముగ్గురు మృతదేహాలు అంకిత్, రెహాన్, అయాన్గా పోలీసులు గుర్తించారు. అసలే ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వేడి కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు స్నానాలు చేసేందుకు కాలువలు లేదా నదుల్లోకి వెళ్తుంటారు. కాలువలోకి ప్రవేశించిన తరువాత, బలమైన ప్రవాహం, ఈత రాకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Read Also:Janasena: రాజోలులో పవన్కు ఎదురుదెబ్బ.. జనసేనకు కీలక నేత గుడ్బై
వేసవిలో ఇటువంటి సంఘటనలు తరచుగా గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా వేగంగా ప్రవహించే కాలువలు, నదుల్లో ఏటా అనేక మంది మరణిస్తున్నారు. మునక్ వంటి కాలువల విషయంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, స్నానాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు స్నానాలు చేయకుండా ఉండాలన్నారు.
తాజావార్తలు
-
Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
-
Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
-
Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
-
PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!