Delhi : ఢిల్లీలో విషాదం.. కాలువలో మునిగి చనిపోయిన ముగ్గురు ఫ్రెండ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : రాజధాని ఢిల్లీలోని హైదర్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సమీపంలోని మునాక్ కెనాల్లో మునిగి ముగ్గురు చిన్నారులు బుధవారం మృతిచెందారు. ముగ్గురు చిన్నారులు స్నానానికి కాల్వలోకి ప్రవేశించారని, అయితే ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగి చనిపోయారని అంచనా వేస్తున్నారు. చనిపోయిన ముగ్గురు చిన్నారులు స్నేహితులు. రామ నవమి నాడు పాఠశాలలు మూసివేయబడ్డాయి. దీంతో ముగ్గురూ కలిసి కాలువలో స్నానం చేయడానికి వెళ్లారు. కాని ఇది వారి చివరి రామ నవమి అని వారికి తెలియదు.
ముగ్గురు పిల్లలు ఢిల్లీలోని భల్స్వా నివాసితులు. మొదట ఓ చిన్నారి నీట మునిగిన వార్త అందింది. దీని తర్వాత డైవర్ల బృందం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కాలువలోకి దిగినప్పుడు, ఒకరు కాదు ముగ్గురు స్నేహితులు మునిగిపోయారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. డైవర్లు తొలుత కాలువ నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు పిల్లల వయస్సు దాదాపు 13 నుంచి 15 ఏళ్లు ఉంటుందని తెలిపారు.
Also Read
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
Read Also:Mrunal Takur : జిమ్ లో తెగ కష్టపడుతున్న మృణాల్.. వీడియో వైరల్..
కాలువలో ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై రోహిణి జిల్లాలోని కేఎన్ కట్జూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదం చిన్నారులకు జరిగిందా లేక ఎవరైనా కుట్ర పన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు కూడా దీన్ని ప్రమాదంగానే పరిగణిస్తున్నారు.
ముగ్గురు చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముగ్గురు మృతదేహాలు అంకిత్, రెహాన్, అయాన్గా పోలీసులు గుర్తించారు. అసలే ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వేడి కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు స్నానాలు చేసేందుకు కాలువలు లేదా నదుల్లోకి వెళ్తుంటారు. కాలువలోకి ప్రవేశించిన తరువాత, బలమైన ప్రవాహం, ఈత రాకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Read Also:Janasena: రాజోలులో పవన్కు ఎదురుదెబ్బ.. జనసేనకు కీలక నేత గుడ్బై
వేసవిలో ఇటువంటి సంఘటనలు తరచుగా గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా వేగంగా ప్రవహించే కాలువలు, నదుల్లో ఏటా అనేక మంది మరణిస్తున్నారు. మునక్ వంటి కాలువల విషయంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, స్నానాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు స్నానాలు చేయకుండా ఉండాలన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..