Delhi : ఢిల్లీలో విషాదం.. కాలువలో మునిగి చనిపోయిన ముగ్గురు ఫ్రెండ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : రాజధాని ఢిల్లీలోని హైదర్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సమీపంలోని మునాక్ కెనాల్లో మునిగి ముగ్గురు చిన్నారులు బుధవారం మృతిచెందారు. ముగ్గురు చిన్నారులు స్నానానికి కాల్వలోకి ప్రవేశించారని, అయితే ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగి చనిపోయారని అంచనా వేస్తున్నారు. చనిపోయిన ముగ్గురు చిన్నారులు స్నేహితులు. రామ నవమి నాడు పాఠశాలలు మూసివేయబడ్డాయి. దీంతో ముగ్గురూ కలిసి కాలువలో స్నానం చేయడానికి వెళ్లారు. కాని ఇది వారి చివరి రామ నవమి అని వారికి తెలియదు.
ముగ్గురు పిల్లలు ఢిల్లీలోని భల్స్వా నివాసితులు. మొదట ఓ చిన్నారి నీట మునిగిన వార్త అందింది. దీని తర్వాత డైవర్ల బృందం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కాలువలోకి దిగినప్పుడు, ఒకరు కాదు ముగ్గురు స్నేహితులు మునిగిపోయారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. డైవర్లు తొలుత కాలువ నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు పిల్లల వయస్సు దాదాపు 13 నుంచి 15 ఏళ్లు ఉంటుందని తెలిపారు.
Also Read
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
Read Also:Mrunal Takur : జిమ్ లో తెగ కష్టపడుతున్న మృణాల్.. వీడియో వైరల్..
కాలువలో ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై రోహిణి జిల్లాలోని కేఎన్ కట్జూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదం చిన్నారులకు జరిగిందా లేక ఎవరైనా కుట్ర పన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు కూడా దీన్ని ప్రమాదంగానే పరిగణిస్తున్నారు.
ముగ్గురు చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముగ్గురు మృతదేహాలు అంకిత్, రెహాన్, అయాన్గా పోలీసులు గుర్తించారు. అసలే ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వేడి కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు స్నానాలు చేసేందుకు కాలువలు లేదా నదుల్లోకి వెళ్తుంటారు. కాలువలోకి ప్రవేశించిన తరువాత, బలమైన ప్రవాహం, ఈత రాకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Read Also:Janasena: రాజోలులో పవన్కు ఎదురుదెబ్బ.. జనసేనకు కీలక నేత గుడ్బై
వేసవిలో ఇటువంటి సంఘటనలు తరచుగా గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా వేగంగా ప్రవహించే కాలువలు, నదుల్లో ఏటా అనేక మంది మరణిస్తున్నారు. మునక్ వంటి కాలువల విషయంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, స్నానాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు స్నానాలు చేయకుండా ఉండాలన్నారు.
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!