Delhi : ఢిల్లీలో విషాదం.. కాలువలో మునిగి చనిపోయిన ముగ్గురు ఫ్రెండ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : రాజధాని ఢిల్లీలోని హైదర్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సమీపంలోని మునాక్ కెనాల్లో మునిగి ముగ్గురు చిన్నారులు బుధవారం మృతిచెందారు. ముగ్గురు చిన్నారులు స్నానానికి కాల్వలోకి ప్రవేశించారని, అయితే ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగి చనిపోయారని అంచనా వేస్తున్నారు. చనిపోయిన ముగ్గురు చిన్నారులు స్నేహితులు. రామ నవమి నాడు పాఠశాలలు మూసివేయబడ్డాయి. దీంతో ముగ్గురూ కలిసి కాలువలో స్నానం చేయడానికి వెళ్లారు. కాని ఇది వారి చివరి రామ నవమి అని వారికి తెలియదు.
ముగ్గురు పిల్లలు ఢిల్లీలోని భల్స్వా నివాసితులు. మొదట ఓ చిన్నారి నీట మునిగిన వార్త అందింది. దీని తర్వాత డైవర్ల బృందం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కాలువలోకి దిగినప్పుడు, ఒకరు కాదు ముగ్గురు స్నేహితులు మునిగిపోయారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. డైవర్లు తొలుత కాలువ నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు పిల్లల వయస్సు దాదాపు 13 నుంచి 15 ఏళ్లు ఉంటుందని తెలిపారు.
Also Read
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
- Trump: ఇరాన్పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
Read Also:Mrunal Takur : జిమ్ లో తెగ కష్టపడుతున్న మృణాల్.. వీడియో వైరల్..
కాలువలో ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై రోహిణి జిల్లాలోని కేఎన్ కట్జూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదం చిన్నారులకు జరిగిందా లేక ఎవరైనా కుట్ర పన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు కూడా దీన్ని ప్రమాదంగానే పరిగణిస్తున్నారు.
ముగ్గురు చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముగ్గురు మృతదేహాలు అంకిత్, రెహాన్, అయాన్గా పోలీసులు గుర్తించారు. అసలే ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వేడి కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు స్నానాలు చేసేందుకు కాలువలు లేదా నదుల్లోకి వెళ్తుంటారు. కాలువలోకి ప్రవేశించిన తరువాత, బలమైన ప్రవాహం, ఈత రాకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Read Also:Janasena: రాజోలులో పవన్కు ఎదురుదెబ్బ.. జనసేనకు కీలక నేత గుడ్బై
వేసవిలో ఇటువంటి సంఘటనలు తరచుగా గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా వేగంగా ప్రవహించే కాలువలు, నదుల్లో ఏటా అనేక మంది మరణిస్తున్నారు. మునక్ వంటి కాలువల విషయంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, స్నానాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు స్నానాలు చేయకుండా ఉండాలన్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..