AC Coaches Missing: తప్పిపోయిందా? తప్పించుకొని పోయారా? రైలు నుంచి ఏసీ కోచ్ మిస్సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AC Coaches Missing: రైలుకు బోగిలు ఉంటాయి.. అవి రైలు పట్టాల మీద ఉంటాయని మనకు తెలుసు. కానీ పట్టాల మీద ఉన్న రైలు మూడు బోగిలు కనిపించకుండా పోయిన ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసా.. ఫిబ్రవరి 1వ తేదీ తెల్లవారుజామున ఒడిశాలోని సంబల్పూర్ రైల్వే స్టేషన్లో వెలుగు చూసింది. సంబల్పూర్ – నాందేడ్ నాగవళి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో రిజర్వు చేసిన కోచ్ కోసం టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారికి సీట్లు కేటాయించి బోగిలు కనిపించక ఆందోళన చెందారు. వాళ్ల బోగిలను వెతుక్కోవడం కోసం రైలు పొడవునా స్కాన్ చేయవలసి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PM Modi: పీఎం మోడీ మాస్టర్ స్ట్రోక్.. వారంలో రెండు ఒప్పందాలు!
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
పలు నివేదికల ప్రకారం.. భువనేశ్వర్ నుంచి నాందేడ్ వైపు ప్రయాణిస్తున్న రైలు నంబర్ 20809 సంబల్పూర్ చేరుకున్నప్పుడు ఓ ఏసీ కోచ్ కనిపించలేదు. తమకు కేటాయించిన 3AC కోచ్ కోసం ప్రత్యేకంగా వేచి ఉన్న కొంతమంది ప్రయాణికులు ఆందోళన చెందారు. 3AC కోచ్ BE2 కి కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్న 57 మంది ప్రయాణికులు.. ట్రైన్ మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో రైలు వచ్చే సమయానికి కంటే ముందుగానే స్టేషన్కు చేరుకున్నారు. నాగావళి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాగానే, వారు తమ కోచ్ కోసం వెతకడానికి రైలును మొత్తం స్కాన్ చేశారు. కానీ వారికి కేటాయించిన బోగి BE2 కోచ్ జత చేయకుండానే రైలు సంబల్పూర్ నుంచి బయలుదేరిందని స్పష్టమైంది. ఈ విషయాన్ని గ్రహించిన చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు రైలు ఎక్కాలా వద్దా అని తెలియక తికమకపడ్డారు. కోచ్ లేకుండా వచ్చిన రైలు గురించి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు సహాయం కోసం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్స్ (TTE)ను సంప్రదించారు. పలు నివేదికల ప్రకారం.. టికెట్లు బుక్ చేసుకున్న వారిని ఇతర కోచ్లలోని సీట్లలో కూర్చోమని చెప్పారు, అంతే కానీ అసలు ఏం జరిగిందో స్పష్టమైన వివరణ ఇవ్వలేదని వివరించారు.
ఘటనపై రైల్వే అధికారుల వివరణ..
ఈ ఘటనపై తూర్పు కోస్ట్ రైల్వే అధికారులు స్పందిస్తూ.. “సాంకేతిక సమస్య కారణంగా, ఒక రిజర్వు కోచ్ (BE2) ను రైలు నంబర్ 20809 కు అటాచ్ చేయడం సాధ్యం కాలేదు. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులను ఆన్-బోర్డ్ TTE ఇతర కోచ్లలో అందుబాటులో ఉన్న ఖాళీ బెర్తులలో కూర్చునేలా ఏర్పాటు చేశారు” అని తూర్పు కోస్ట్ రైల్వే (ECoR) ఒక ప్రకటనలో తెలిపింది.
READ ALSO: Biker Release Date: శర్వా స్పీడ్ మామూలుగా లేదుగా! ‘బైకర్’ రిలీజ్ డేట్ లాక్..
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!