మహారాష్ట్రలోని పుణెలో రోడ్డుప్రమాదం జరిగింది. యావత్ గ్రామంలోని సహజ్పూర్ ఫాటా సమీపంలో రాష్ట్ర రవాణా బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఆదివారం పూణె జిల్లాలో చెట్టును ఢీకొనడంతో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పంఢర్పూర్ (షోలాపూర్ జిల్లా) నుంచి ముంబై వైపు బస్సు వెళ్తుండగా యావత్ గ్రామంలోని సహజ్పూర్ ఫాటా దగ్గర ఈ ఘటన జరిగింది. ముగ్గురు నుంచి నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించినట్లు యావత్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ్ దేశ్ముఖ్ తెలిపారు. ప్రమాదం వెనుక కారణం తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Revu Party: “రేవు”పార్టీలో హేమాహేమీలు.. ఆర్జీవి మురళీమోహన్ సహా?