Bengaluru: ప్రజలకు నీటి కష్టాలు.. 22 కుటుంబాలకు జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో నీటి ఎద్దడి కొందరికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా తాగు నీటి కోసం బెంగళూరు వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. బోర్లు అడుగంటి పోవడం, కాలువలు, చెరువులు ఎండిపోవడం.. ఇలా ఒకదాని వెంట ఒకటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాగునీరు వృథా చేయొద్దని కొద్ది రోజులుగా హెచ్చరిస్తూనే వస్తున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. తాజాగా తాగునీరు అనవసరమైన పనులకు వినియోగించిన కుటుంబాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
నీటి వృథాపై సోషల్ మీడియా ప్లాట్ఫాం వేదికగా ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 22 కుటుంబాలకు రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. నీటి కొరత నేపథ్యంలో తాగునీరు సంరక్షణకు తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు తెలిపింది. తాగునీటిని కార్ వాషింగ్ లేదా గార్డెన్ అవసరాలకు వాడినందుకు గాను నగరంలోని వివిధ ప్రాంతాల్లో 22 కుటుంబాల నుంచి మొత్తం రూ.1.1 లక్షల మేర జరిమానాగా వసూలు చేసినట్లు వెల్లడించింది. దక్షిణ ప్రాంతం నుంచే అత్యధికంగా రూ.80 వేలు జరిమానా వసూలు చేసినట్లు పేర్కొంది.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
బెంగళూరు నగరంలో నీటి కటకటను దృష్టిలోఉంచుకుని తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ఇటీవల నీటి సరఫరా బోర్డు ప్రజలకు సూచించింది. వాహనాలు కడగడం, నిర్మాణాలు, వినోద సంబంధిత కార్యక్రమాల కోసం తాగునీరు వాడొద్దని కోరింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మళ్లీ ఈ చర్య పునరావృతమైతే ప్రతిసారీ రూ.500 అదనంగా జరిమానా విధించాలని నిర్ణయించింది. మరోవైపు, హోలీ వేడుకల సందర్భంగా ప్రజలు కావేరీ, బోరుబావుల నీటిని పార్టీలు, రెయిన్ డ్యాన్స్ల కోసం వినియోగించొద్దని సూచించింది. అనవసర నీటి వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా ఎయిరేటర్లు అమర్చేలా హోటళ్లు, అపార్టుమెంట్లు, పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఓ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
గత కొద్ది రోజులుగా తాగు నీటి కొరతతో బెంగళూరు వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేక తంటాలు పడుతున్నారు. మరోవైపు కొనేందుకు నీళ్లు దొరకడం లేదు. పైగా కొందామంటే ట్యాంకర్ల ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ఓ వైపు ఎండకాలం.. ఇంకోవైపు నీళ్లు కొరత.. ఇలా మార్చి నెలలోనే ఇంతటి ఇబ్బందులు ఉంటే.. ఏప్రిల్, మే నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!