Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News 2059 Nuclear Tests In 80 Years India Conducted 3

Nuclear Tests in 80 Years: 80 ఏళ్లలో 2059 అణు బాంబులు బ్లాస్ట్.. ఇండియాలో ఎన్ని జరిగాయంటే?

Published Date :August 25, 2025 , 7:42 pm
By Shiva Ganesh
Nuclear Tests in 80 Years: 80 ఏళ్లలో 2059 అణు బాంబులు బ్లాస్ట్.. ఇండియాలో ఎన్ని జరిగాయంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nuclear Tests in 80 Years: కొన్ని అగ్రదేశాలు ప్రపంచానికి అణుబూచి చూపించి భయపెట్టి పబ్బం గడుపుతున్నాయి. వాస్తవానికి ఈ అణుబాంబులకు అంత పవర్ ఉందా అంటే.. కచ్చితంగా అనే సమాధానం సెకన్ ఆలస్యం లేకుండా వస్తుంది. ఎందుకంటే ఈ అణుబాంబుల విధ్వాంసానికి నాశమైన ప్రదేశాలు ప్రత్యేక్ష ఉదాహరణలుగా నిలిచాయి, అందుకే అణుబాంబులకు ప్రపంచం భయపడేది. 1945లో జపాన్‌లోని నాగసాకి, హిరోషిమాలో అణుదాడి కారణంగా సుమారుగా 2.10 లక్షల మంది ప్రజలు మరణించారు, లక్ష మందికి పైగా వికలాంగులయ్యారని తెలుసిన విషయమే. కానీ హిరోషిమా దాడి తర్వాత ప్రపంచంలో ఎన్ని అణు విస్ఫోటనాలు జరిగాయో ఎంత మందికి తెలుసు.. ఈ స్టోరీలో ఎన్ని అణు బ్లాస్ట్‌లు జరిగాయి, వాటిలో ఇండియాలో ఎన్ని జరిగాయో తెలుసుకుందాం..

READ ALSO: J&K Cyber Security Move: జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అక్కడ ఈ సేవలు బంద్

2059.. నెంబర్ పెద్దదే..
ఆయుధ నియంత్రణ సంఘం నివేదికల ప్రకారం.. గత 80 ఏళ్లలో 2059 అణు బాంబులు బ్లా్స్ట్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో జరిగాయి. దాని తర్వాత స్థానంలో కజకిస్థాన్, ఫ్రాన్స్‌ ఉన్నాయి. భారత్‌లో ఈ అణు విస్ఫోటనం 3 సార్లు జరిగింది, పొరుగు దేశమైన పాక్‌లో 2 సార్లు అణు బాంబు పేలుళ్లు జరిగినట్లు సమాచారం. 1945 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలను తయారు చేయడానికి పోటీ ఏర్పడిందని ఆయుధ నియంత్రణ సంఘం చెబుతోంది. 1945 – 1996 మధ్య అమెరికా 1030 అణుబాంబు పేలుళ్లు జరిగాయి. ప్రస్తుతం అగ్రరాజ్యం వద్ద 3900 అణ్వాయుధాలు ఉన్నాయి. 1950 ప్రాంతంలో రష్యా మొదటిసారి అణు పరీక్షలు నిర్వహించింది. మాస్కో కజకిస్థాన్‌లో అత్యధిక సంఖ్యలో అణుబ్లాస్ట్‌లు చేసింది. ప్రస్తుతం రష్యా వద్ద 4100 కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. ఫ్రాన్స్ ఇప్పటి వరకు 210 అణు పరీక్షలు నిర్వహించింది. చైనా 45, బ్రిటన్ 45 సార్లు అణుబాంబు పరీక్షలు చేశాయి. ఈ అణు విస్ఫోటనం వరుసలో చివరి దేశం ఉత్తర కొరియా. చైనా వద్ద 600, ఇండియా వద్ద 180, పాకిస్థాన్ వద్ద 150, ఉత్తర కొరియా వద్ద 50 అణ్వాయుధాలు ఉన్నాయి.

అణు పరీక్షలు ఎక్కడ జరిగాయి..
అమెరికా నెవాడా, మార్షల్ దీవులు, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో 1,000 కి పైగా అణు పరీక్షలను నిర్వహించింది. రష్యా కజకిస్థాన్, ఆర్కిటిక్ మహాసముద్రంలోని నోవాయా జెమ్లియా ద్వీపసమూహంలో తన అణ్వాయుధాలను పరీక్షించింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రంలోని కిరిటిమతి దీవులలో పరీక్షించగా, ఫ్రాన్స్ అల్జీరియా, ఫ్రెంచ్ పాలినేషియాలో పేలుళ్లు నిర్వహించింది. చైనా తన అణు పరీక్షను పశ్చిమ జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని మారుమూల ఎడారి ప్రదేశంలో నిర్వహించింది. భారతదేశం పోఖ్రాన్‌లో, పాకిస్థాన్ బలూచిస్తాన్‌లో అణు పరీక్షలను నిర్వహించాయి. ఉత్తర కొరియా చైనాకు ఆనుకుని ఉన్న ఒక ద్వీపంలో అణు పరీక్షలు జరిపింది.

చాలా అణు పరీక్షలు ఇసుకలో, నీటిలో జరిగాయి. సంవత్సరాల తరువాత ఇప్పుడు మెల్లగా వాటి ప్రభావాలు కనిపిస్తున్నాయి. కజకిస్థాన్‌లో ప్రజలు తమ భవిష్యత్ తరాలు కూడా ఈ పేలుడు వల్ల బాధపడతారని అంటున్నారు. సుమారు 12 లక్షల మంది కజకిస్థాన్‌ ప్రజలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అమెరికా పరీక్షల కోసం మార్షల్ దీవుల ప్రజలను ఇతర ప్రదేశాలకు తరలించింది. అయినప్పటికీ 27 వేల మంది ఈ అణు కార్యక్రమాలతో బాధపడుతున్నారు. ఫ్రాన్స్ అల్జీరియా ప్రజలకు క్షమాపణ కూడా చెప్పింది. ఫ్రాన్స్ ప్రజలు అల్జీరియాకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు.

READ ALSO: Nara Rohith: ఈ సినిమా లైన్ చెబితే కంగారు పడ్డా.. కానీ అందరికీ కనెక్ట్ అవుతుంది!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2059 nuclear explosions
  • India nuclear tests
  • nuclear bomb effects by country
  • nuclear bomb history
  • nuclear powers in the world

తాజావార్తలు

  • World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..

  • Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

  • Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!

  • IND vs NZ: 17 ఏళ్ల పాకిస్థాన్ రికార్డు బ్రేక్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో నంబర్ 1 జోడీగా సంజు-అభిషేక్

  • India vs New Zealand: అభిషేక్ ఊచకోత.. వరల్డ్ కప్ నాకౌట్‌లో ‘యువీ’ రికార్డు బద్ధలు! పవర్ ప్లేలో ప్రపంచ రికార్డు..

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions