Indusind Bank: ఇండస్ఇండ్ బ్యాంక్లో భారీ కుంభకోణం.. ఏకంగా రూ. 2000 కోట్లు..!
- ఇండస్ఇండ్ బ్యాంక్లో భారీ కుంభకోణం
- ఏకంగా రూ. 2000 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అకౌంటింగ్ లాప్స్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ప్రాథమిక దర్యాప్తులో బ్యాంకు అప్పటి టాప్ మేనేజ్ మెంట్ తన అకౌంటింగ్ పుస్తకాలలో సర్దుబాట్లు చేసినట్లు అంగీకరించిందని వెల్లడించింది. ఈ కేసులో సుమారు రూ. 2,000 కోట్ల దుర్వినియోగం జరిగిందని తెలిపారు.
Also Read:Sonam Raghuvanshi: దసరా రోజున సూర్పణఖ స్థానంలో.. సోనమ్ దిష్టిబొమ్మ దహనం.. కోర్టు కీలక తీర్పు
Also Read
గత వారం బ్యాంకు మాజీ సీఎఫ్ఓ గోవింద్ జైన్, మాజీ డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానా, మాజీ సీఈఓ సుమంత్ కథ్పాలియాల నుంచి ఈఓడబ్ల్యూ వాంగ్మూలాలు నమోదు చేసిందని వర్గాలు తెలిపాయి. తర్వాత ఖురానాను మళ్లీ విచారణకు పిలిచారు. బ్యాంకు ఖాతాల్లో జరిగిన మార్పులు, సర్దుబాట్ల గురించి ఖురానాకు తెలుసు కాబట్టి, ఆయన పాత్ర కీలకమని దర్యాప్తుతో పరిచయం ఉన్న వర్గాలు చెబుతున్నాయి.
ఈ సర్దుబాట్లు బ్యాంకు షేర్ ధరను కృత్రిమంగా పెంచాయని, ఆ సమయంలో కొంతమంది టాప్ మేనేజ్ మెంట్ అధికారులు ఈ సమాచారాన్ని ఆసరాగా చేసుకుని ఇన్సైడర్ ట్రేడింగ్లో పాల్గొన్నారని, ఈ ప్రక్రియలో వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి.
అనేక మంది ఉద్యోగులు, మాజీ అధికారులను ప్రశ్నించిన తర్వాత, బ్యాంకు పుస్తకాలు రెండు వేర్వేరు టైటిల్స్ కింద సర్దుబాటు చేయబడ్డాయని EOW గుర్తించింది. ఇది స్టాక్ ధరను ప్రభావితం చేసింది. అయితే, కొంతమంది మాజీ అధికారులు తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని పేర్కొన్నారు. తదుపరి చర్యలు ఏమి తీసుకోవాలో EOW త్వరలో న్యాయ అధికారులు, ఆర్థిక నిపుణుల సలహా తీసుకుంటుందని వర్గాల సమాచారం. ఈ కేసు సత్యం కుంభకోణంతో దగ్గరి పోలికలను కలిగి ఉందని దర్యాప్తులో పాల్గొన్న ఒక సీనియర్ అధికారి చెప్పారు.
ఇండస్ఇండ్ బ్యాంక్ మొదట దాని డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో ఈ అకౌంటింగ్ లోపాన్ని కనుగొంది. కానీ తరువాత అది దాని మైక్రోఫైనాన్స్ వ్యాపారానికి వ్యాపించింది. ఈ విషయం వెల్లడైన తర్వాత, CEO సుమంత్ కథ్పాలియా, డిప్యూటీ CEO అరుణ్ ఖురానా ఏప్రిల్ 2025లో రాజీనామా చేశారు.
Also Read:AP Politics : పవన్తో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ
ఇప్పటివరకు, EOW ఏడు నుండి ఎనిమిది మంది ఉద్యోగుల నుండి స్టేట్మెంట్లను నమోదు చేసింది. ఈ స్టేట్మెంట్ల ఆధారంగా, మాజీ టాప్ బ్యాంక్ అధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ అధికారులకు మళ్ళీ సమన్లుపంపే అవకాశం ఉంది. మాజీ CFO గోవింద్ జైన్ గతంలో ట్రెజరీ అవకతవకలను ఆరోపించారు. ఆగస్టు 26న, ఆయన ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాస్తూ, బ్యాంకు ట్రెజరీ కార్యకలాపాల్లో దశాబ్ద కాలంగా తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయని, వాటి విలువ దాదాపు రూ. 2,000 కోట్లు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?