Indusind Bank: ఇండస్ఇండ్ బ్యాంక్లో భారీ కుంభకోణం.. ఏకంగా రూ. 2000 కోట్లు..!
- ఇండస్ఇండ్ బ్యాంక్లో భారీ కుంభకోణం
- ఏకంగా రూ. 2000 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అకౌంటింగ్ లాప్స్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ప్రాథమిక దర్యాప్తులో బ్యాంకు అప్పటి టాప్ మేనేజ్ మెంట్ తన అకౌంటింగ్ పుస్తకాలలో సర్దుబాట్లు చేసినట్లు అంగీకరించిందని వెల్లడించింది. ఈ కేసులో సుమారు రూ. 2,000 కోట్ల దుర్వినియోగం జరిగిందని తెలిపారు.
Also Read:Sonam Raghuvanshi: దసరా రోజున సూర్పణఖ స్థానంలో.. సోనమ్ దిష్టిబొమ్మ దహనం.. కోర్టు కీలక తీర్పు
Also Read
- New ZPs: ఏపీలో జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
- Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
- Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
- AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
గత వారం బ్యాంకు మాజీ సీఎఫ్ఓ గోవింద్ జైన్, మాజీ డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానా, మాజీ సీఈఓ సుమంత్ కథ్పాలియాల నుంచి ఈఓడబ్ల్యూ వాంగ్మూలాలు నమోదు చేసిందని వర్గాలు తెలిపాయి. తర్వాత ఖురానాను మళ్లీ విచారణకు పిలిచారు. బ్యాంకు ఖాతాల్లో జరిగిన మార్పులు, సర్దుబాట్ల గురించి ఖురానాకు తెలుసు కాబట్టి, ఆయన పాత్ర కీలకమని దర్యాప్తుతో పరిచయం ఉన్న వర్గాలు చెబుతున్నాయి.
ఈ సర్దుబాట్లు బ్యాంకు షేర్ ధరను కృత్రిమంగా పెంచాయని, ఆ సమయంలో కొంతమంది టాప్ మేనేజ్ మెంట్ అధికారులు ఈ సమాచారాన్ని ఆసరాగా చేసుకుని ఇన్సైడర్ ట్రేడింగ్లో పాల్గొన్నారని, ఈ ప్రక్రియలో వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి.
అనేక మంది ఉద్యోగులు, మాజీ అధికారులను ప్రశ్నించిన తర్వాత, బ్యాంకు పుస్తకాలు రెండు వేర్వేరు టైటిల్స్ కింద సర్దుబాటు చేయబడ్డాయని EOW గుర్తించింది. ఇది స్టాక్ ధరను ప్రభావితం చేసింది. అయితే, కొంతమంది మాజీ అధికారులు తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని పేర్కొన్నారు. తదుపరి చర్యలు ఏమి తీసుకోవాలో EOW త్వరలో న్యాయ అధికారులు, ఆర్థిక నిపుణుల సలహా తీసుకుంటుందని వర్గాల సమాచారం. ఈ కేసు సత్యం కుంభకోణంతో దగ్గరి పోలికలను కలిగి ఉందని దర్యాప్తులో పాల్గొన్న ఒక సీనియర్ అధికారి చెప్పారు.
ఇండస్ఇండ్ బ్యాంక్ మొదట దాని డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో ఈ అకౌంటింగ్ లోపాన్ని కనుగొంది. కానీ తరువాత అది దాని మైక్రోఫైనాన్స్ వ్యాపారానికి వ్యాపించింది. ఈ విషయం వెల్లడైన తర్వాత, CEO సుమంత్ కథ్పాలియా, డిప్యూటీ CEO అరుణ్ ఖురానా ఏప్రిల్ 2025లో రాజీనామా చేశారు.
Also Read:AP Politics : పవన్తో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ
ఇప్పటివరకు, EOW ఏడు నుండి ఎనిమిది మంది ఉద్యోగుల నుండి స్టేట్మెంట్లను నమోదు చేసింది. ఈ స్టేట్మెంట్ల ఆధారంగా, మాజీ టాప్ బ్యాంక్ అధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ అధికారులకు మళ్ళీ సమన్లుపంపే అవకాశం ఉంది. మాజీ CFO గోవింద్ జైన్ గతంలో ట్రెజరీ అవకతవకలను ఆరోపించారు. ఆగస్టు 26న, ఆయన ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాస్తూ, బ్యాంకు ట్రెజరీ కార్యకలాపాల్లో దశాబ్ద కాలంగా తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయని, వాటి విలువ దాదాపు రూ. 2,000 కోట్లు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
New ZPs: ఏపీలో జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
-
AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
-
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!