200 Year Old Message: గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం!
- 200 ఏళ్ల క్రితం నాటి సందేశం
- గౌలిష్ గ్రామానికి సంబంధించిన వివరాలు
- 1825లో గౌలిష్ ప్రాంతంలో తవ్వకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
200 Year Old Letter: పురావస్తు శాఖ తవ్వకాల్లో దాదాపు 200 ఏళ్ల క్రితం నాటి ఓ సందేశం తాజాగా బయటపడింది. ఓ పురావస్తు శాస్త్రవేత్త గాజు సీసాలో పెట్టిన సందేశం ఫ్రాన్స్లోని నార్మాండీ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఒక వలంటీర్ల బృందానికి దొరికింది. ఈ వారంలో అత్యవసర తవ్వకాలు చేపడుతుండగా.. సందేశం లభ్యమైందని వారు వెల్లడించారు. గాజు సీసాలో చుట్టి ఉంచిన ఒక లేఖ ఉంది. నార్మాండీ పట్టణానికి సమీపంలో కొండపై ఉండే గౌలిష్ అనే గ్రామానికి సంబంధించిన వివరాలు ఆ లేఖలో ఉన్నాయి.
పలు మేధో సంఘాల్లో సభ్యుడిగా ఉన్న ‘పీజే ఫెరెట్’ అనే స్థానిక పురావస్తు శాస్త్రవేత్త జనవరి 1825లో గౌలిష్ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టినట్టు లేఖలో ఉంది. ఈ ప్రాంతంలో ఆయన పలు పరిశోధనలు చేసినట్లు ఉంది. పురావస్తు శాస్త్రవేత్త ఫెరెట్ స్థానికంగా ప్రముఖు వ్యక్తి అని ఓ అంతర్జాతీయ మీడియా తమ కథనం పేర్కొంది. 200 ఏళ్ల క్రితం ఫెరెట్ మొదటిసారి తవ్వకాలు నిర్వహించినట్టు ఫ్రెంచ్ పట్టణం మున్సిపల్ రికార్డులు చెబుతున్నాయి.
Also Read
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
Also Read: Senegal Migrants: సెనెగల్ తీరంలో తీవ్ర విషాదం.. పడవలో 30 మృతదేహాలు!
తవ్వకాలు చేపట్టిన వలంటీర్ల బృందానికి సారధ్యం వహించిన గిల్లామ్ బ్లొండెల్ మాట్లాడుతూ… ‘మహిళలు వాసన వెదజల్లె లవణాలు కలిగిన ఉన్న చిన్నచిన్న సీసాలను మెడ చుట్టూ ధరించేవారు. గతంలో ఇక్కడ త్రవ్వకాలు జరిగాయని మాకు తెలుసు. కానీ 200 సంవత్సరాల క్రితం నాటీ ఈ సందేశాన్ని కనుగొనడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా వడ్రండి పనిచేసేవాళ్లు ఇలాంటి టైమ్ క్యాప్సూల్స్ వదిలిపెడుతుంటారు. కానీ పురావస్తు శాస్త్రంలో ఇలా జరగడం చాలా అరుదు. చాలా మంది పురావస్తు శాస్త్రజ్ఞులు వారి పని పూర్తయ్యాక ఇంకా ఎవరూ రారులే అని భావిస్తుంటారు. ఇది గౌలిష్ గ్రామం అనే విషయం మాకు తెలుసు. ఈ ఊరిలో ఏం జరిగిందనేది తెలియదు. అది ప్రాముఖ్యమైన ప్రదేశమా? అన్నది కనుక్కోవాలి’ అని అన్నారు.
తాజావార్తలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!