Chennai: చెన్నైలో దారుణం.. 5 ఏళ్ల చిన్నారిపై కుక్కల దాడి.. పరిస్థితి సీరియస్
తమిళనాడులోని చెన్నైలో దారుణం జరిగింది. రెండు రోట్వీలర్స్.. ఐదేళ్ల చిన్నారిపై దాడికి తెగబడ్డాయి. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటినా తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ ఏరియాలోని పబ్లిక్ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం చిన్నారితో పార్క్లో ఉన్నప్పుడు ఈ దారుణం జరిగింది.
ఇది కూడా చదవండి: Anna Rambabu: జగనన్న మళ్లీ సీఎం అయితేనే మంచి జరుగుతుంది..
Also Read
ఆదివారం సాయంత్రం చెన్నైలోని పబ్లిక్ పార్క్కి చిన్నారితో తల్లిదండ్రులు వెళ్లారు. రోట్వీలర్స్ జాతికి చెందిన రెండు కుక్కలను యజమాని నిర్లక్ష్యంగా విడిచిపెట్టేశాడు. దీంతో అమాంతంగా చిన్నారిపై ఎగిసిపడ్డాయి. ఎంత బెదిరించినా అవి విడిచిపెట్టలేదు. దీంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిర్లక్ష్యం వహించిన కుక్కల యాజమానిని అరెస్ట్ చేశారు. అలాగే కుక్కలను చూసుకునే మరో ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. తాజా సంఘటనతో పెంపుడు జంతువులపై చర్చ మొదలైంది.
ఇది కూడా చదవండి: Mango Ice Cream Paan : ఐస్ క్రీమ్ తో పాన్ ఏంట్రా బాబు.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..
పోలీసులు సమాచారం మేరకు.. చెన్నైలోని థౌజండ్ లైట్స్ ఏరియాలోని పబ్లిక్ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. యజమాని.. కుక్కలను విడిచిపెట్టాడని వారు చెప్పారు. కుక్కలు చిన్నారిపై దాడి చేశాయని.. తల్లిదండ్రులు రక్షించడానికి ప్రయత్నించినా యజమాని మాత్రం జోక్యం చేసుకోలేదని వెల్లడించారు. ఇదిలా ఉంటే చిన్నారి తండ్రి పార్కులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో యజమానితో పాటు కుక్కలను సంరక్షిస్తున్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి శేఖర్ దేశ్ముఖ్ తెలిపారు. పార్క్లోని సీసీటీవీ ఫుటేజీలో ఆ రెండు కుక్కలు కనిపించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పుకొచ్చారు.
పిట్బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్వీలర్, మాస్టిఫ్లతో సహా 23 జాతుల క్రూరమైన కుక్కల అమ్మకం మరియు పెంపకాన్ని నిషేధించాలని మార్చిలో కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇప్పటికే ఈ జాతులను పెంపుడు జంతువులుగా కలిగి ఉన్నవారు వాటిని ఒకేసారి క్రిమిరహితం చేయాలని ఆదేశాలు ఉన్నాయి. అలాగే కొన్ని జాతులను పెంపుడు జంతువులుగా ఉంచకుండా నిషేధించాలని పౌరుల ఫోరమ్లు, జంతు సంక్షేమ సంస్థల నుంచి ఫిర్యాదులు అందాయని పశుసంవర్ధక శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Radhika Khera: రాహుల్ గాంధీ యాత్రలో నాకు మద్యం ఆఫర్ చేశారు.. కాంగ్రెస్పై రాధికా ఖేరా సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!