Crime: రోజూ తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. రాడ్డుతో కొట్టి చంపేసిన మైనర్ కొడుకు
- రోజూ తాగొచ్చి భార్యను కొడుతున్న భర్త
- రాడ్డుతో కొట్టి చంపేసిన మైనర్ కొడుకు
- ఢిల్లీలోని అమన్ విహార్ ప్రాంతంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని అమన్ విహార్ ప్రాంతంలో ఓ మైనర్ తన తండ్రిని పైపుతో కొట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న 50 ఏళ్ల వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు హత్య
కేసు నమోదు చేశారు. కాగా.. కొడుకు 16 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
READ MORE: Test Cricket: ఒకే టెస్టు మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి 5 వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
బీహార్కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి తన భార్య, ముగ్గురు కుమారులతో కలిసి అమన్ విహార్ ప్రాంతంలో నివసించాడు. అతను వెల్డింగ్ పనులు చేసేవాడు. అతని 16 ఏళ్ల కుమారుడు ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు అమన్ విహార్ ప్రాంతంలో జరిగిన గొడవ గురించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా వీధిలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతని తల నుంచి రక్తం కారుతోంది. సమీపంలో ఒక ఇనుప పైపు పడి ఉంది. పోలీసులు వెంటనే గాయపడిన వ్యక్తిని సమీపంలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు.
పోలీసులు సంఘటనా స్థలానికి క్రైమ్, ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు. అక్కడి నుంచి బృందం పలు ఆధారాలు సేకరించింది. విచారణలో మృతుడు మద్యానికి బానిసైనట్లు పోలీసులు గుర్తించారు. మద్యం సేవించి తరచూ భార్యను కొట్టేవాడు. ఆదివారం ఉదయం భార్యతో గొడవపడగా కుమారుడు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో కోపంతో తండ్రిపై పైపుతో దాడి చేశాడు. తండ్రి తనను తాను రక్షించుకునేందుకు వీధిలోకి వచ్చాడు. మైనర్ కొడుకు తల, మెడపై పైపుతో దాడి చేశాడు. దీంతో మృతి చెందాడు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!