Rajasthan: పండితుడిగా తిరిగి వస్తానని లేఖ రాసి.. ఇంటిని నుంచి వెళ్లిన విద్యార్థి.. చివరకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్లో జైపూర్ జిల్లాలోని చౌము పట్టణంలో 12వ తరగతి విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లి మందలించడంతో ఆ విద్యార్థికి కోపం వచ్చింది. అతను తన స్టడీ సర్టిఫికేట్లను తన బ్యాగ్లో ఉంచుకున్నాడు. ఇంట్లో నుంచి రూ.రెండు వేల నగదు చోరీ చేసి తల్లి చూడకముందే ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. సెప్టెంబరు 17వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో విద్యార్థిని అకస్మాత్తుగా ఇంటి నుంచి అదృశ్యమవడంతో తల్లి టెన్షన్పడింది. సాయంత్రం వరకు అక్కడక్కడ వెతికినా విద్యార్థికి సంబంధించిన సమాచారం దొరకలేదు. అర్థరాత్రి ఆ మహిళ చౌము పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టింది.
Also Read: Bandi Sanjay: మహిళా బిల్లు విషయంలో ఆ రెండు పార్టీలు ద్వంద్వ వైఖరి మార్చుకోవాలి..
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
విద్యార్థి కిడ్నాప్కు సంబంధించిన సమాచారం పోలీసులకు చేరడంతో వారు కేసు నమోదు చేసి వెతకడం ప్రారంభించారు. చౌము ప్రాంతంలోని విద్యార్థి ఇంటి నుంచి మార్కెట్, స్టేషన్ వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు సోదా చేశారు. బ్యాగ్తో విద్యార్థి వెళ్లిపోతున్నట్లు కెమెరాలు చూపించాయి. విద్యార్థి ఎక్కడికి వెళ్లాడు? ఈ విషయం పోలీసులకు తెలియలేదు. చౌము పోలీసులు, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రంతా విద్యార్థి కోసం వెతుకుతూనే ఉన్నారు. చౌము బస్ స్టేషన్ నుంచి జైపూర్ జంక్షన్ వరకు సోదాలు నిర్వహించారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యార్థి స్వయంగా క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. విద్యార్థి తిరిగి రావడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Karnataka High Court: సోషల్ మీడియా వినియోగంపై వయోపరిమితిని ప్రభుత్వం పరిగణించాలి..
విద్యార్థి ఇంటికి తిరిగి రాగానే పోలీసులు ఆ బాలుడితో మాట్లాడగా.. అతను చెప్పిన మాటలు విని వారు నివ్వెరపోయారు. తాను ఇంటి నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లినట్లు చెప్పాడు. రాత్రి దాబాలో భోజనం చేసి రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలో పడుకున్నాడు. నిద్ర లేవగానే అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు తన గురించి ఆందోళన చెందుతారని భావించాడు. విద్యార్థి తన తప్పును గుర్తించడంతో, అతను కాలినడకన ఇంటికి తిరిగి వచ్చాడు. విద్యార్థి ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు శాంతించారు.
పండితుడిని అయితే ఇంటికి వస్తానని లేఖ రాసి..
ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో విద్యార్థి తన కుటుంబ సభ్యుల కోసం ఓ నోట్ను ఉంచాడు. కుటుంబ సభ్యుల కోసం వదిలిపెట్టిన లేఖలో, ‘నా గురించి చింతించకండి. నేను మంచి పండితుడిని అయితే ఇంటికి వస్తాను. నేను వెళ్ళేటప్పటికి అమ్మ, చెల్లి, తమ్ముడిని ఏమీ నిందించకు. ఎందుకంటే నేను నా స్వంత ఇష్టానుసారం వెళ్ళాను. 2 వేల రూపాయలు తీసుకుంటున్నాను. ఎవరైనా అడిగితే చదువుల కోసం విదేశాలకు పంపించారని చెప్పండి.’ అంటూ ఆ లేఖలో రాశాడు. ఆ లేఖను చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?