J-K: భారత్పై కుట్రకు పాకిస్థాన్ భారీ ప్లాన్..150 మందికి పైగా ఉగ్రవాదులు చొరబాటుకు యత్నం..
- భారత్పై కుట్రకు పాక్ భారీ ప్లాన్
- 150 మందికి పైగా ఉగ్రవాదులు భారత్లో చొరబాటుకు యత్నం
- తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది
- ఇప్పటికే తగి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైనట్లు అధికారి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్తో సహా భారతదేశంలోని ఇతర ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చని ఓ సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి షాకింగ్ సమాచారం ఇచ్చారు. దాదాపు 150 మంది ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (కశ్మీర్ ఫ్రాంటియర్) అశోక్ యాదవ్ చెప్పారు. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో 150 మందికి పైగా ఉగ్రవాదులు సరిహద్దు వెంబడి లాంచ్ ప్యాడ్ వద్ద భారత సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సరిహద్దు భద్రతా దళం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, అలాంటి ప్రయత్నాలను విఫలం చేస్తామన్నారు.
READ MORE: Vishwambhara : మెగా ఫాన్స్ కి దసరా బొనాంజా.. గెట్ రెడీ
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
సరిహద్దుల్లోని లాంచ్ప్యాడ్పై ఉగ్రవాదులు..
శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో లోయలోకి చొరబడేందుకు దాదాపు 150 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి లాంచ్ప్యాడ్లపై కూర్చున్నట్లు సమాచారం. అయితే భద్రతా దళాలు వారి ప్రయత్నాన్ని విఫలం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ అంశంపై శుక్రవారం బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (కశ్మీర్ ఫ్రాంటియర్) అశోక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. చొరబాటు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. వివిధ ఏజెన్సీల నుంచి తమకు అందుతున్న నిఘా ఆధారంగా, సరిహద్దులో బలమైన వ్యూహాన్ని ఏర్పాటు చేయడానికి సైన్యంతో సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. లాంచ్ప్యాడ్లోని ఉగ్రవాదులను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్నారు. తమకు ఓ ప్రత్యేక వ్యూహం ఉందని.. ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
READ MORE:Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కీలక పరిణామం..
‘మొబైల్ బంకర్లు, మహిళా సైనికులు కూడా మోహరించారు’
నియంత్రణ రేఖ వెంబడి కొన్ని గ్రామాలు, తంగ్ధర్, కెరాన్ సెక్టార్ల వంటి కొన్ని సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే కొంతమంది మహిళలను కొరియర్లుగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున భద్రతా బలగాలు మొబైల్ బంకర్లను, మహిళా సైనికులను కూడా మోహరించారు. ఆయుధ నిర్వహణ, కాల్పులు, ఫీల్డ్ క్రాఫ్ట్, వ్యూహాలు, ఓర్పు కార్యకలాపాలు వంటి సరిహద్దు నిర్వహణ యొక్క సాంప్రదాయిక అంశాలలో మాత్రమే కాకుండా.. తాజా సాంకేతికతలో కూడా సైనికులకు శిక్షణ ఉండేలా దళం కృషి చేస్తుందని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?