Mohammad Kaif: నీ ఆటకు సలాం.. 14 ఏళ్లకే డబుల్ సెంచరీ చేసిన బుడ్డోడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా క్రికెట్ ను సచిన్ ముందు, సచిన్ తర్వాత అన్నట్టుగా విడదీయొచ్చు. బౌలర్లు ఆధిపత్యం చెలాయించే ఆ రోజుల్లో ఓ పదహారేళ్ళ కుర్రాడు ప్రపంచ క్రికెట్ ని వణికించేశాడు. పదహారేళ్లకు తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసి బౌలర్లకు నైట్ మెర్ గా మారాడు. అంతకుముందు 15 ఏళ్ళ వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీ చేసి ఇండియన్ క్రికెట్లోతారాజువ్వగా దూసుకొచ్చాడు. ఇప్పుడు పద్నాలుగేళ్లకే డబుల్ సెంచరీలతో మోత మోగిస్తున్నారు. ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ అనే పద్నాలుగేళ్ల కుర్రాడు 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తాజాగా మరో ఆణిముత్యం బయటపడింది.
READ MORE: MI vs GT: నెంబర్ 1 జట్టుగా అయ్యేదెవరో.. మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై
Also Read
వైభవ్ తరహాలో ఉత్తరప్రదేశ్కు చెందిన 14 ఏళ్ల యువ క్రికెటర్ మహ్మద్ కైఫ్ డెహ్రాడూన్లో జరిగిన అండర్-14 రాజ్ సింగ్ దుంగార్పూర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. 280 బంతులను ఎదుర్కొన్న కైఫ్ 250 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్లో 19 ఫోర్లు 12 సిక్సర్లు నమోదయ్యాయి. ఇటీవల కాన్పూర్లో జరిగిన ట్రయల్స్ ఆధారంగా కైఫ్ అండర్-14 UP జట్టులోకి ఎంపికయ్యాడు. ఫైనల్ మ్యాచ్లో యూపీ విదర్భతో తలపడింది. ఉత్తరప్రదేశ్ తరఫున కైఫ్ 250 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో 377 నిమిషాలు గడిపి 89.29 స్ట్రైక్ రేట్తో బౌలర్లను ఊచకోత కోశాడు. కైఫ్ కీలక ఇన్నింగ్స్ ఆధారంగా యుపి అద్భుత విజయాన్ని అందుకుంది. మహ్మద్ కైఫ్ పేదకుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి మున్నా రోజువారీ కూలీ. క్రికెటర్ కావాలనే తన కలకు తండ్రి సపోర్టుగా నిలిచాడు. అలా గల్లీ క్రికెట్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ వరకు ఎదిగాడు కైఫ్. భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ,మహ్మద్ కైఫ్ భారత క్రికెట్లోకి ఎంట్రీ ఇస్తారని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.
READ MORE: Mock Drill: హైదరాబాద్లో రేపు మాక్ డ్రిల్.. సైరన్ మోగగానే ప్రజలు ఏం చేయాలో తెలుసా?
తాజావార్తలు
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
-
CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?