Amarnath Yatra : అమర్నాథ్ యాత్రలో తొలిరోజు బాబా బర్ఫానీని దర్శించుకున్న 13 వేల మంది భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amarnath Yatra : దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో కట్టుదిట్టమైన భద్రతలో అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. శనివారం 13,000 మంది భక్తులు బం బం భోలే నినాదంతో పవిత్ర గుహలో బాబా బర్ఫాని దర్శనం చేసుకున్నారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ ఆలయానికి ప్రయాణం ప్రారంభించేందుకు బాల్టాల్, నునావన్లోని రెండు బేస్ క్యాంపుల నుండి యాత్రికుల మొదటి బ్యాచ్ బయలుదేరింది. అమర్నాథ్ యాత్ర ప్రారంభం సందర్భంగా యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, బాబా బర్ఫానీని చూడడం వల్ల శివ భక్తుల్లో అపారమైన శక్తి వస్తుందని అన్నారు.
ప్రధాని అభినందనలు
పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన సందర్భంగా ‘యాత్రికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ‘X’ పోస్ట్లో ప్రధాని పేర్కొన్నారు. బాబా బర్ఫానీ దర్శనానికి సంబంధించిన ఈ ప్రయాణం శివ భక్తులలో అపారమైన శక్తిని నింపుతుంది. ఆయన అనుగ్రహంతో భక్తులందరూ సుఖశాంతులను పొందాలని నా కోరిక. జై బాబా బర్ఫానీ.’ అంటూ రాసుకొచ్చారు. అమర్నాథ్ గుహ ఆలయానికి సురక్షితమైన, సులభమైన, ఆహ్లాదకరమైన తీర్థయాత్ర అనుభూతిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Also Read
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
Read Also:Team India: 17ఏళ్ల కల నెరవేరిన వేళ..ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న భారత్ జట్టు..
అమర్నాథ్ యాత్ర భారతీయ సంస్కృతి, సంప్రదాయవాదం కొనసాగింపునకు శాశ్వతమైన చిహ్నం అని అమిత్ షా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X లో పోస్ట్ చేశారు. నేటి నుంచి ఈ దివ్య యాత్ర ప్రారంభమైంది. భక్తులందరికీ బాబా దర్శనం, పూజలు జరగాలని కోరుకుంటున్నాను. ప్రధాని మోడీ నాయకత్వంలో, భక్తులకు సురక్షితమైన, సాఫీగా , ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆగస్టు 19 వరకు పాదయాత్ర
ఉదయం రెండు మార్గాల్లో ప్రయాణం ప్రారంభమైంది. మొదటిది అనంత్నాగ్లోని 48 కి.మీ పొడవైన సాంప్రదాయ నున్వాన్-పహల్గామ్ మార్గం.. రెండవది చిన్నదైన, కానీ ఏటవాలు 14 కి.మీ పొడవు గల బల్తాల్ మార్గం గందర్బాల్. 52 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర ఆగస్టు 19తో ముగియనుంది. సహజంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు తొలిరోజు 13,736 మంది యాత్రికులు గుహాలయానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతి నగర్లోని యాత్రి నివాస్ బేస్ క్యాంపు నుండి 4,603 మంది యాత్రికుల మొదటి బ్యాచ్ను జెండా ఊపి ప్రారంభించారు. యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు , ఇతర పారామిలటరీ బలగాలకు చెందిన వేలాది మంది భద్రతా సిబ్బంది యాత్ర మార్గంలో మోహరించారు. వైమానిక నిఘా కూడా చేస్తున్నారు. కాశ్మీర్లోని రెండు అమర్నాథ్ బేస్ క్యాంపులలో రెండు 100 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. వార్షిక యాత్ర తర్వాత కూడా అవి పనిచేస్తాయని ప్రకటించింది. గత ఏడాది 4.5 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ గుహ ఆలయాన్ని సందర్శించారు.
Read Also:Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!