Delhi: తీహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్..జైల్లో ఏం జరుగుతోంది..?
- ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి షాకింగ్ న్యూస్
- 125 మంది ఖైదీలు హెచ్ఐవీ పాజిటివ్
- 200 మంది ఖైదీలు సిఫిలిస్ వ్యాధి
- ఇటీవల 10 వేల 500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని తీహార్ జైలు (తీహార్, రోహిణి, మండోలి) నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తించారు. అయితే.. హెచ్ఐవీ పాజిటివ్ ఖైదీలు కొత్తేంకాదు. కానీ.. 200 మంది ఖైదీలు సిఫిలిస్ వ్యాధి బారిన పడినట్లు తేలింది. ఇటీవల 10 వేల 500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ జైళ్లలో దాదాపు 14000 మంది ఖైదీలు ఉన్నారు.
READ MORE: Nitish kumar: నీతి అయోగ్ సమావేశానికి నితీష్ కూడా డుమ్మా? సర్వత్రా చర్చ
Also Read
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
తీహార్ జైలులో ఎప్పటికప్పుడు ఖైదీలకు మెడికల్ స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది. ఇటీవలే వచ్చిన డీజీ సతీష్ గోల్చా తీహార్ జైలు బాధ్యతలు చేపట్టిన తర్వాత మే, జూన్ నెలల్లో పదిన్నర వేల మంది ఖైదీలకు మెడికల్ చెకప్ చేయించారు. ఈ ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 125 మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్గా తేలింది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఖైదీలకు ఇటీవల ఎయిడ్స్ రాలేదని అధికారులు అంటున్నారు. వివిధ కారణాలతో ఈ ఖైదీలు బయటికి వెళ్లి నుంచి జైలుకు వచ్చినప్పుడు వారికి వైద్య పరీక్షలు చేయగా… అప్పుడు హెచ్ఐవీ నిర్ధారణ అయినట్లు తెలిపారు.
READ MORE:Deputy CM Pawan Kalyan: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్..
మహిళా ఖైదీలకు సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు..
ఇది కాకుండా.. పదిన్నర వేల మంది ఖైదీలలో 200 మంది ఖైదీలకు సిఫిలిస్ వ్యాధి అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. ఈ ఖైదీలందరిలో టీబీ వ్యాధిగ్రస్థులు లేరు. తీహార్ జైలులోని ప్రొటెక్టివ్ సర్వే విభాగం.. మహిళా ఖైదీలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షను నిర్వహించింది. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పరీక్ష చేయించారు. ఈ పరీక్ష ముందుజాగ్రత్తగా చేయబడుతుంది. తద్వారా ఎవరికైనా గర్భాశయ క్యాన్సర్ పరీక్ష సానుకూలంగా మారినట్లయితే.. వారికి ప్రారంభంలోనే మంచి చికిత్స అందిస్తారు. ఇప్పటి వరకైతే క్యాన్సర్ కేసుల సమాచారం ఇంకా రాలేదు.
తాజావార్తలు
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!