Nalanda: నలందలో బయటిపడిన 1,200 ఏళ్ల నాటి పురాతన విగ్రహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalanda: పురాతన నలంద విశ్వవిద్యాలయానికి సమీపంలోని ఒక చెరువులో పూడిక తీసే సమయంలో సుమారు 1,200 ఏళ్ల నాటివిగా భావించబడే రెండు రాతి విగ్రహాలు కనుగొనబడినట్లు భారత పురావస్తు శాఖ అధికారి తెలిపారు. ఇక్కడి నుంచి 88 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన నలంద మహావీర సమీపంలోని సర్లిచక్ గ్రామం వద్ద ఉన్న తార్సిన్ చెరువులో ఈ వారం ప్రారంభంలో విగ్రహాలు కనుగొనబడ్డాయి. ప్రపంచ వారసత్వ ప్రదేశం, నీటిని సంరక్షించడానికి బీహార్ ప్రభుత్వం ప్రారంభించిన ‘జల్-జీవన్-హరియాలీ’ ప్రాజెక్ట్ కింద తవ్వకాలు చేపట్టాలు చేపట్టగా ఈ విగ్రహాలు బయటపడినట్లు తెలుస్తోంది. అయితే, రెండు విగ్రహాల వివరాలను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించలేదు. ఈ ప్రాంతంలో నివసించే గ్రామస్థులు విగ్రహాలు కనుగొనబడిన విషయం తెలుసుకున్నప్పుడు, వారు వీటిని ఉంచడానికి ఒక ఆలయాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం ప్రారంభించినట్లు సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ గౌతమీ భట్టాచార్య తెలిపారు.
అక్కడ ఉన్న పురావస్తు శాఖ అధికారాలు గ్రామస్థులు ఏర్పాట్లు గురించి తెలుసుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పుడు 1200 సంవత్సరాల వయస్సు గల రెండు విగ్రహాలు ఇప్పుడు స్థానిక పోలీసుల అదుపులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. తాము వాటిని నలంద మ్యూజియంలో ప్రదర్శించాలనుకుంటున్నామన్నారు. ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్, 1878లోని నిబంధనల ప్రకారం ఈ విగ్రహాలను తక్షణమే అందజేయాలని తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించానని గౌతమీ భట్టాచార్య చెప్పారు.
Also Read
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
Petrol Rate: రాష్ట్ర బడ్జెట్లో సామాన్యులకు షాక్.. పెట్రోల్ ధర రూ.2 పెంపు
ఏదైనా పురాతన వస్తువులు లేదా నిధి ఉపరితలం క్రింద దొరికినప్పుడు సాధారణంగా స్థానికులు సమీపంలోని దేవాలయం లేదా ఇతర మతపరమైన ప్రదేశాలకు తీసుకువస్తారని అధికారి తెలిపారు. భారతీయ ట్రెజర్ ట్రోవ్ చట్టం, 1878 ప్రకారం, రూ.10 కంటే ఎక్కువ విలువైన ఏదైనా పురాతన వస్తువులు లేదా కళాఖండాలు కనుగొనబడినప్పుడు వాటిని కనుగొనే వారిచే సమీపంలోని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. సంబంధిత జిల్లా కలెక్టర్కు నిధిని పొందే అధికారం ఉంటుంది.
“నేను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాను. ఈ చట్టంలోని నిబంధనల గురించి అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు తెలియజేయాలని సంబంధిత అధికారాన్ని అభ్యర్థించాను, తద్వారా నిధులను జిల్లా యంత్రాంగం సురక్షిత కస్టడీలో డిపాజిట్ చేయవచ్చు” అని గౌతమీ భట్టాచార్య చెప్పారు. ఏడాది క్రితం ఇదే చెరువులో పాల కాలం నాటి 1,300 ఏళ్ల నాటి నాగ దేవి విగ్రహం లభించింది. ఇది నలందలోని భారత పురావస్తు శాఖ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచబడింది.
Supreme Court : కొలీజియం సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే ఐదుగురు జడ్జీల నియామకం
నలంద మహావిహార స్థలంలో 3వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఉన్న సన్యాసుల, పాండిత్య సంస్థ పురావస్తు అవశేషాలు ఉన్నాయి. ఇందులో స్థూపాలు, పుణ్యక్షేత్రాలు, విహారాలు (నివాస, విద్యా భవనాలు), గార, రాయి, లోహంలో ముఖ్యమైన కళాకృతులు ఉన్నాయి.నలంద భారత ఉపఖండంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయం. ఇది 800 సంవత్సరాల నిరంతరాయ కాలంలో జ్ఞానాన్ని వ్యవస్థీకృత ప్రసారం చేయడంలో నిమగ్నమై ఉంది.
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!