ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్ కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కాశ్మీర్ కు చెందిన వారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల కుటుంబాలు విమానాశ్రయంలో తమ పిల్లల కోసం ఆసక్తిగా ఎదురు చూశాయి. రాజస్థాన్లోని కోటకు చెందిన ఓ విద్యార్థి తండ్రి మాట్లాడుతూ.. “నా కొడుకు ఇరాన్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. అతను ఇప్పుడు భారత ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చాడు. నేను భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని అన్నారు.
Also Read:Naga Bandham: 10 నిమిషాలకు 10 కోట్లు.. అబ్బుర పరిచేలా నాగబంధం సెట్..!
ఢిల్లీలో దిగిన తర్వాత విద్యార్థి అమన్ అజార్ ANIతో మాట్లాడుతూ.. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కుటుంబాన్ని కలిసిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను. ఇరాన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడి ప్రజలు కూడా మనలాగే ఉన్నారు, చిన్న పిల్లలు బాధపడుతున్నారు. యుద్ధం ఎవరికీ మంచిది కాదు. ఇది మానవత్వాన్ని నాశనం చేస్తుంది” అని అన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యను ఆ కుటుంబాలు హృదయపూర్వకంగా అభినందించాయి.
Also Read:CM Chandrababu: మామిడికి అదనపు మద్దతు ధర.. సీఎం ఆదేశాలు
అదే సమయంలో ఇరాన్ యుద్ధ ప్రాంతంలో, ముఖ్యంగా టెహ్రాన్లో ఇప్పటికీ చిక్కుకుపోయిన విద్యార్థుల పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ఇరాన్లో 4,000 మందికి పైగా భారతీయ పౌరులు ఉన్నారు. వీరిలో సగం మంది విద్యార్థులు. అక్కడ చిక్కుకున్న ఇతర పౌరులు సురక్షితంగా తిరిగి వచ్చేలా భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో కలిసి పనిచేస్తోంది.
#WATCH | Flight carrying 110 Indian Nationals evacuated from Iran, lands in Delhi.
Mariam Roz, a student evacuated from Iran, says, "The Indian Embassy had already prepared everything for us. We did not face any issues. We are travelling for three days, so we are tired… The… pic.twitter.com/EIi6z7Kgsi
— ANI (@ANI) June 19, 2025
