Rapid Rail: నమో భారత్ ట్రైన్లో ఫస్ట్ 10వేలమంది ప్రయాణం.. టికెట్ కొనకపోతే ఫైన్ తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapid Rail: దేశానికి తొలి ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైలు బహుమతి లభించింది. ర్యాపిడ్ రైల్ నమో భారత్ తొలి రోజున అందులో ప్రయాణించేందుకు జనం భారీగా తరలివచ్చారు. నమో భారత్ తొలిరోజు సాహిబాబాద్ నుంచి దుహై వరకు 10 వేల మంది ప్రయాణించారు. అయితే, రైలు ప్రారంభమైన మొదటి రోజు ప్రజలు టిక్కెట్లు కోసం క్యూలలో నిలబడవలసి వచ్చింది. ఇదిలా ఉంటే నమో భారత్ టిక్కెట్లకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది.
Read Also:Nithya Menen : ఆమె తన మాటలతో నన్ను ఇబ్బంది పెట్టేది..
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
టిక్కెట్పై కొత్త అప్డేట్
NCRCTC నమో భారత్ టిక్కెట్ కోసం కొత్త అప్డేట్ విడుదల చేయబడింది. అప్డేట్ ప్రకారం, ప్రయాణానికి తీసుకున్న టికెట్ కేవలం రెండు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దీని తర్వాత ఈ టికెట్ గడువు ముగుస్తుంది. గడువు ముగిసిన టిక్కెట్తో ఎవరైనా పట్టుబడితే గంట ప్రాతిపదికన జరిమానా విధించబడుతుంది. జరిమానా గంటకు రూ.10 ఉంటుంది. ప్రస్తుతం జరిమానా నిబంధనను సడలించినా త్వరలో కఠినంగా అమలు చేయనున్నారు. సరాయ్ కాలే ఖాన్-మీరట్ మధ్య ప్రయాణం ఒక గంటలో పూర్తవుతుంది కాబట్టి టిక్కెట్ చెల్లుబాటును రెండు గంటలపాటు ఉంచినట్లు అధికారులు తెలిపారు. దీని తర్వాత కూడా ఒక గంట అదనపు సమయం ఇచ్చారు. స్టేషన్లో ప్రయాణికులు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.
Read Also:Egypt’s aid for Gaza: ఈజిప్టు సహాయం సముద్రంలో నీటిచుక్క లాంటిది.. గాజా
రాపిడ్ రైల్లో ప్రయాణించిన విరాట్ కోహ్లి మామ
దేశంలోనే తొలి ర్యాపిడ్ రైలు ‘నమో భారత్’లో ప్రజల కోసం శనివారం ఉదయం నుంచి ప్రయాణం ప్రారంభమైంది. తొలిరోజే పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. సాయంత్రం వరకు 10 వేల మంది ప్రయాణించగా, 2 వేల మంది ఆర్ఆర్టిఎస్ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. రైలును చూసేందుకు ఘజియాబాద్ నుంచే కాకుండా ఢిల్లీ నుంచి కూడా పలువురు శనివారం ఉదయం నుంచి సాహిబాబాద్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ రైలులో విరాట్ కోహ్లి మామతో సహా చాలా మంది యూట్యూబర్లు ప్రయాణించారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!