Accident: ఘోర ప్రమాదం.. రక్షాబంధన్ వేడుకలకు వెళ్తున్న కూలీల ట్రక్కును ఢీకొన్న బస్సు..10 మంది మృతి
- ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- రక్షాబంధన్ వేడుకలు జరుపుకునేందుకు ఇంటికి వెళ్తున్న కూలీల మృతి
- . ఈ ప్రమాదంలో పది మంది మృత్యువాత
- పలువురు చిన్నారులు సహా 29 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రక్షాబంధన్ వేడుకలు జరుపుకునేందుకు ఇంటికి వెళ్తున్న కూలీల పికప్ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా, పలువురు చిన్నారులు సహా 29 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Governor Jishnu Dev Varma: “మైల్స్ ఆఫ్ స్మైల్స్” మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
పోలీసుల కథనం ప్రకారం.. అలీఘర్లోని అత్రౌలీ తహసీల్లోని అహెరియా నాగ్లా గ్రామానికి చెందిన కార్మికులు ఘజియాబాద్లోని ఒక ఫ్యాక్టరీలో పని చేసేవారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని కూలీలంతా ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఘజియాబాద్ నుంచి పికప్లో తమ తమ గ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఉదయం10.15 ప్రాంతంలో సేలంపూర్ వద్దకు రాగానే వేగంగా వస్తున్న బస్సు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం అనంతరం రోడ్డుపై పడిన క్షతగాత్రులను స్థానికులు ప్రయివేటు వాహనాలు, అంబులెన్స్ల సాయంతో ప్రయివేటు ఆసుపత్రితోపాటు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అలాగే బస్సులో చిక్కుకున్న డ్రైవర్ను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం క్రేన్ సాయంతో బస్సులో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
READ MORE:Top Headlines @5PM : టాప్ న్యూస్
చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి చేరుకున్న క్షతగాత్రులలో పది మంది మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బదౌన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న దగ్గమార్ బస్సు డ్రైవర్ అతి వేగంతో మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడు. రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు ఉండటంతో.. డ్రైవర్ ట్రాక్పైకి మళ్లించాడు. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని, అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. అరగంట ఆలస్యంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని స్థానికులు ఆరోపించారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..