Fire Accident: ఇంట్లో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: పాకిస్తాన్లో దిగువ కోహిస్థాన్లోని పట్టాన్ ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక మహిళ, ఆమె అత్తగారు, ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు సహా ఒకే కుటుంబంలోని పది మంది సభ్యులు మరణించారు. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్లోని కోహిస్థాన్లో శుక్రవారం తెల్లవారుజామున 4గంటలకు లాంతరు నుంచి చెలరేగిన మంటల కారణంగా మహ్మద్ నవాబ్ అనే వ్యక్తికి చెందిన చెక్క ఇంటితో పాటు పక్కనే ఉన్న పశువుల పాక దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేసిన కుటుంబ సభ్యులను వెలికితీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారందరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ నవాబ్ భార్య చబ్బర్ బీబీ, అతని తల్లి జాహిదా బీబీ, ఐదుగురు కుమార్తెలు – లిలీ నవాబ్(20), సమ్రియన్ బీబీ(18), సమీనా బీబీ(16), బీబీ సనో(12), అలీనా బీబీ(19), ముగ్గురు కుమారులు – మునీర్ నవాబ్ (5), ముజీబ్ నవాబ్ (9), అజీజ్ నవాబ్ (2) కాలి బూడిదయ్యారు. అగ్నిప్రమాదంలో అనేక పశువులు కూడా చనిపోయాయని వారు చెప్పారు.
Also Read
- విరాట్ కోహ్లీ వాడే 'హూప్' కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
- RRB JE Recruitment 2026: 4,098 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, దరఖాస్తు విధానం ఇవే
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- India - Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!
Read Also: Boyfriend Suicide: ప్రియురాలు మాట్లాడట్లేదని.. ఉరేసుకున్న టెక్కీ
ఘటనాస్థలానికి రెస్క్యూ సిబ్బంది సకాలంలో చేరుకోకపోవడం వల్లే 10 మంది ప్రాణాలు పోయాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్క్యూ సిబ్బందిపై చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కరంకోరం హైవేపై మృతదేహాలతో బైఠాయించారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. డిప్యూటీ కమీషనర్ మహ్మద్ రఫీక్ వారితో మాట్లాడి.. మరణించిన కుటుంబానికి రూ. 5 మిలియన్ల పరిహారం ప్రకటించిన తర్వాత వారు శాంతించారు. ఈ విషాద ఘటనపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ముహమ్మద్ ఆజం ఖాన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తాజావార్తలు
-
విరాట్ కోహ్లీ వాడే ‘హూప్’ కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
-
RRB JE Recruitment 2026: 4,098 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, దరఖాస్తు విధానం ఇవే
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
-
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
-
India – Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!