గణేష్ నిమజ్జనంపై తెలంగాణ మంత్రుల ఏరియల్ సర్వే !
గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ. 19 వ తేదీన మధ్యాహ్నం 1.00 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి మంత్రులతో పాటు DGP మహేందర్ రెడ్డి, హైదరాబాద్ CP అంజనీ కుమార్ ఏరియల్ వ్యూ నిర్వహించనున్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో ఈ రోజు మరోసారి సమీక్షించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లక్షలాది మంది పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని.
విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పరిసరాలలో 40 క్రేన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని… GHMC వ్యాప్తంగా 300 క్రేన్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రశాంతంగా శోభాయాత్ర నిర్వహించేలా 19 వేల మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ట్యాంక్ బండ్ పరిధిలో 2600 LED లైట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్మీ స్మార్ట్ఫోన్ ను రూ. 15,000 తక్కువకే కొనండి!
-
AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
-
Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
-
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
-
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!