Wrestler Vinesh Phogat: కేంద్రమంత్రిపై రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wrestler Vinesh Phogat: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మహిళా క్రీడాకారిణులపై బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ లైంగిక వేధిపులకు పాల్పడినట్లు రెబర్లు ఆరోపిస్తున్నారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెజ్లర్ల నిరసనకు అగ్రశ్రేణి రెజ్లర్ వినేష్ ఫోగట్ మద్దతు తెలిపారు. శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడం చాలా కష్టమని ఆమె బ్రిజ్ భూషన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
చాలా కాలం తన అధికారాన్ని, పదవిని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తిని ఎదిరించడం కష్టం అని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే వినేష్ ఫోగట్ కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ పై సంచలన ఆరోపణలు చేశారు. మహిళా అథ్లెట్లు లైంగిక వేధింపులకు గురువుతున్నారని, మానసికంగా హింసించబడతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, అయితే ఆయన కమిటీ వేసి సమస్యను అణిచివేస్తున్నారని వినేష్ ఫోగట్ మండిపడ్డారు.
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
Read Also: The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమా వివాదం ఏంటి?.. ఎందుకీ వ్యతిరేకత..?
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తో మాట్లాడిన తర్వాత మేము నిరసనను ముగించామని, అయితే ఆయన కమిటీ వేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకు మళ్లీ నిరసన తెలుపుతున్నామన్నారు. ఒలింపిక్స్ ఎంపిక కోెసం తీసుకువచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామన్న ఆరోపణలపై రెజ్లర్ బజరంగ్ పునియా స్పందించారు. ఇది ఒలింపిక్ నిబంధనలకు వ్యతిరేకం కాదని, ఇది లైంగిక వేధింపులకు వ్యతిరేకం అని అన్నారు.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు ఆరోపణలపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 90 శాతం మంది హర్యానా క్రీడాకారులు తమ వెంటే ఉన్నారని, ఒక రెజర్లు మాత్రమే జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారని బ్రిజ్ భూషన్ అన్నారు. రెజ్లర్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ తన ‘‘మన్ కీ బాత్’’ వినాలని కోరారు.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!