Taliban-Priyanka Gandhi: మహిళా జర్నలిస్టులను ఎందుకు పిలువలేదు.. కేంద్రంపై ప్రియాంకాగాంధీ ధ్వజం
- మహిళా జర్నలిస్టులను ఎందుకు పిలువలేదు
- కేంద్రంపై ప్రియాంకాగాంధీ ధ్వజం
- అమీర్ ఖాన్ ముత్తాకీ ప్రెస్మీట్లో కనిపించని మహిళా జర్నలిస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ఘనిస్థాన్ బృందం భారత్లో పర్యటిస్తోంది. శుక్రవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. అనంతరం ఢిల్లీలోని ఆప్ఘనిస్థాన్ రాయబార కార్యాలయంలో ఆ దేశ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ విలేకర్ల సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు కూడా లేరు. కేవలం పురుష జర్నలిస్టులను మాత్రమే పిలిచి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఇది తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్రం తీరును ప్రతిపక్ష నేతలు తప్పుపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతా క్లోజ్.. బీజేపీపై ఎస్పీ నేతల ధ్వజం
Also Read
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ‘‘భారతదేశంలో అత్యంత సమర్థులైన మహిళలను అవమానించడం మన దేశంలో ఎలా అనుమతించబడిందని నిలదీశారు. దేశానికి మహిళలు వెన్నెముక, గర్వకారణం’’. అని ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోడీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్ ఫోన్.. సుదీర్ఘంగా సంభాషణ!
మరో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కీలక పోస్ట్ పెట్టారు. ఆఫ్ఘనిస్థాన్ మంత్రి పెస్మీట్లో మహిళలను అనుమతించనప్పుడు పురుష జర్నలిస్టులు ఎందుకు బహిష్కరించలేదని అడిగారు. మీడియా సమావేశం నుంచి వాకౌట్ చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఈ విషయం తనకు షాకిచ్చిందన్నారు.
విమర్శలపై కేంద్రం స్పందించింది. ప్రెస్మీట్ ఆహ్వానాలు ముంబైలోని ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ జనరల్ నుంచే ఎంపిక చేస్తారని.. ఎంపిక చేసిన జర్నలిస్టులకు మాత్రమే ఆహ్వానాలు అందాయన్నారు. ఢిల్లీలోని ఆప్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం కేంద్ర ఆధీనంలో ఉండదని.. ఇది వారి ఎంపిక మాత్రమేనని స్పష్టం చేసింది.
ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వం నడుస్తోంది. మహిళలపై భయంకరమైన ఆంక్షలు ఉంటాయి. విశ్వవిద్యాలయాల్లో మహిళలు రాసిన పుస్తకాలను కూడా నిషేధం విధించారు. బహిరంగంగా తిరిగే స్వేచ్ఛ కూడా ఉండదు. అన్ని విషయాల్లో ఆంక్షలు ఉంటాయి.
Prime Minister @narendramodi ji, please clarify your position on the removal of female journalists from the press conference of the representative of the Taliban on his visit to India.
If your recognition of women’s rights isn’t just convenient posturing from one election to…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 11, 2025
I am shocked that women journalists were excluded from the press conference addressed by Mr Amir Khan Muttaqi of Afghanistan
In my personal view, the men journalists should have walked out when they found that their women colleagues were excluded (or not invited)
— P. Chidambaram (@PChidambaram_IN) October 11, 2025
తాజావార్తలు
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
-
Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?