ఈనెల 8 వ తేదీన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ అయ్యింది. ఓ యువతి చేతికి సిలైన్, ముక్కుకు ఆక్సిజన్ పెట్టుకొని అత్యవసర బెడ్ మీద చికిత్స పొందుతూ కనిపించింది. ఐసీయూలో చేరాల్సి ఉన్నా బెడ్ దొరక్కపోవడంతో అత్యవసర వార్డులో ఆమెకు చికిత్స అందించారు వైద్యులు. సాధారణంగా ఈ పరిస్థితుల్లో ఉన్న రోజులు డీలాపడిపోయి మానసికంగా కృంగిపోయి ఉంటారు. కానీ, ఆ యువతి మాత్రం అలా కాదు. ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా మానసికంగా ధైర్యంగా ఉన్నది. హే జిందగీ అనే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసింది. ఎందరికో సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి నింపిన ఆ ధీర వనిత గురువారం రోజున చికిత్స పొందుతూ మరణించినట్టు ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ మోనిత ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. చాలా బాధాకరం… ఓ ధైర్యమైన గుండెను కోల్పోయాం అని మోనిత ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సంచలంగా మారింది.