NTV Telugu Site icon

Ayodhya: హనీమూన్ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు.. భర్తకు విడాకులు..

Goa

Goa

Ayodhya: అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్లడం ఆమెకు నచ్చలేదు. మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ మహిళకు వివాహమైన ఐదు నెలలకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే భర్త సదరు మహిళను హనీమూన్ కోసం గోవాకు తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు. అయితే, జనవరి 22న అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్లాడు. దీంతో ఆమె తన భర్త నుంచి విడాకుల కావాలని కోరింది. మహిళ తన విడాకులను భోపాల్ లోని కుటుంబ న్యాయస్థానంలో దాఖలు చేసింది.

Read Also: Animal : మూవీ లవర్స్ కి రిపబ్లిక్ డే ట్రీట్.. రేపే యానిమల్ ఓటీటీ రిలీజ్..

గత ఏడాది ఆగస్టు నెలలో వీరిద్దరికి వివాహం జరిగింది. మహిళ భర్త ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. హనీమూన్ కోసం ఆమెను గోవాకు తీసుకెళ్తా అని మాట ఇచ్చాడు. అయితే సదరు వ్యక్తి తల్లిదండ్రులు అయోధ్య ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నారు. తన తల్లి కోరిక మేరకు, భార్యకు ముందుగా చెప్పకుండా అయోధ్య, వారణాసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు తన తల్లి కోరిక మేరకు అయోధ్య వెళ్తున్నామని ఒక రోజు ముందు భార్యకు చెప్పాడు.

అయితే, ప్రయాణానికి ముందు భర్తతో పాటు అయోధ్య వెళ్లిన భార్య.. అక్కడి నుంచి తిరిగి వచ్చాక భర్తను నుంచి విడాకులు కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్త తన కన్నా కుటుంబాన్ని ఎక్కువగా చూసుకుంటున్నాడని ఆమె తన విడాకుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ జంటకు భోపాల్ ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ జరుగుతోంది.