Nurse Left Husband: లోన్ తీసుకొని చదివిస్తే.. నర్సు ఉద్యోగం వచ్చాక లవర్తో చెక్కేసిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nurse Left Husband: జ్యోతి మౌర్య స్టోరీ గుర్తుందా? భర్త చెమటోడ్చి ఆమెను చదివిస్తే.. ఉద్యోగం వచ్చాక భర్తని వదిలేసి, మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి వెలుగు చూసింది. భర్త లోన్ తీసుకొని మరీ చదివిస్తే.. నర్సు ఉద్యోగం రాగానే భార్య తన లవర్తో చెక్కేసింది. నువ్వు మరొకరిని చూసుకో అని చెప్పి వెళ్లిపోయింది. దీంతో.. భర్త తన గోడుని కలెక్టర్ ముందు విన్నవించుకునేందుకు వచ్చాడు. తన భార్యని తిరిగి తన వద్దకు తీసుకురమ్మని వేడుకుంటున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Nani Controversy: పాన్ ఇండియా స్టార్ వ్యాఖ్యలు.. నానిపై మండిడుతున్న బడా హీరోల ఫ్యాన్స్
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఉత్తరప్రదేశ్లోని అనూప్పూర్ జిల్లా పకరియా గ్రామానికి చెందిన జోహన్ భారియా కొన్ని సంవత్సరాల క్రితం మీనాక్షి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. నిజానికి.. ఆమెకు అంతకుముందే మరో వ్యక్తితో పెళ్లయ్యింది. అయితే.. భర్తతో విభేదాల కారణంగా ఆమె పుట్టింటికి తిరిగి వచ్చేసింది. ఆ సమయంలో మీనాకితో జోహన్కి పరిచయం ఏర్పడటం, అది ప్రేమగా మారడం, తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరి పెళ్లికి జోహన్ కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా.. వారిని ఎదురించి మరీ మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకు చిహ్నంగా ఒక కుమార్తె కూడా పుట్టింది. కట్ చేస్తే.. మీనాక్షికి నర్సు అవ్వాలనేది కోరిక. ఈ విషయం తెలుసుకున్న భర్త, ఆమెను చదివించాడు. ఆమె నర్సింగ్ శిక్షణకు తన వద్ద డబ్బులు లేకపోయినా.. లోన్ తీసుకొని మరీ లక్షా 15 వేలు ఖర్చు చేశాడు. బీమా పాలసీని సైతం వదులుకున్నాడు.
Power Bill Cyber Crime: భారీ సైబర్ మోసం.. 5 రూపాయలు పంపగానే, 1.85 లక్షలు హాంఫట్
ఇలా భర్త కష్టార్జితం నర్సింగ్లో శిక్షణ తీసుకున్న మీనాక్షి.. ఎట్టకేలకు నర్సు ఉద్యోగం సంపాదించింది. ప్రభుత్వ నర్సుగా ఎంపికైన ఆమెకు ఖండ్వా జిల్లా ఆసుపత్రిలో పోస్టింగ్ వచ్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత మీనాక్షి తన అసలు రంగు బయటపెట్టింది. అక్కడ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని, భర్తని వదిలేసింది. ‘నా జీవితంలోకి మరొకరు వచ్చారు, నువ్వు ఇంకొకరిని చూసుకో’ అంటూ భర్తకు చెప్పింది. తన కూతురిని సైతం తీసుకెళ్లిపోయింది. తిరిగి రావాలని ఎంత బ్రతిమాలినా ఆమె రాకపోవడంతో.. తన గోడు విన్నవించేందుకు అనూప్పూర్ కలెక్టర్ వద్దకు వెళ్లాడు. అప్పులు చేసి మరీ మీనాక్షిని చదివిస్తే, ఉద్యోగం వచ్చాక తనని వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెను తిరిగి తన దగ్గరకు చేర్చాలని కలెక్టర్ని కోరాడు. మరి.. ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!