Maharashtra: అడవిలో గొలుసులతో బందీగా అమెరికా మహిళ.. రక్షించిన గొర్రెల కాపరి..
- మహారాష్ట్రలో దారుణం..
- సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో బందీగా అమెరికా మహిళ..
- గొర్రెల కాపరి చూడటంతో దక్కిన ప్రాణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికా మహిళ గత కొన్ని రోజులుగా సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో గొలుసులతో ఒక చెట్టుకు నిర్బంధించబడి ఉంది. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 50 ఏళ్ల లలితా కయీ కుమార్ ఎస్ అనే మహిళ తమిళనాడులో నివసిస్తోంది. కుటుంబ కలహాల కారణంగా ఆమె భర్త అటవీలో బంధించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
సింధుదుర్గ్ లోని సోనుర్లి గ్రామ సమీపంలో ఆమె అత్యంత దయనీయ స్థితిలో శనివారం ఓ గొర్రెల కాపరికి కనిపించింది. ఆమె ఏడుపు వినిపించడంతో అటువైపు వెళ్లి చూడగా, ఆమెను గొలుసులో బంధించబడి ఉండటాన్ని చూసిన అతను పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను రక్షించిన పోలీసులు ప్రథమ చికిత్స కోసం సింధుదుర్గ్ లోని సావంత్వాడి తాలూకాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఓరోస్లోని ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: Rahul Gandhi: దేశం చక్రవ్యూహంలో చిక్కుకుపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఆమెకు చికిత్స అందించిన వైద్యుల ప్రకారం.. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆమె తన ఆరోగ్య సమస్యల గురించి కాగితంపై రాసి తమతో చెప్పినట్లు వారు చెప్పారు. ఆమె 40 రోజులుగా ఆహారం తినకుండా ఉందని తెలిసింది. భర్తతో గొడవ పడటంతో అతను తనను అడవీలో బంధించినట్లు వెల్లడించారు. మహిళ స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదని, కొన్ని రోజులుగా ఏమీ తినకపోవడంతో బలహీనంగా ఉందని, అలాగే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఆమెని ఎంత కాలంగా బంధించి ఉంచారో తెలియదని, దీనిపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఆమె దగ్గర తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డ్, అమెరికా పాస్పోర్టు కాపీని కనుగొన్నట్లు వెల్లడించారు. ఆమె ఏ దేశానికి చెందిన వారనే విషయాన్ని ధ్రువీకరించేందుకు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్తో టచ్లో ఉన్నామని పోలీసులు వెల్లడించారు. పోలీసులకు ప్రాథమికంగా లభించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ గత 10 ఏళ్లుగా భారత్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
-
Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
-
YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. ‘పితృసమాన నేతను కోల్పోయాం’
-
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!