Mumbai Viral Video: సముద్ర అలలకు మహిళ బలి.. పిల్లలు చూస్తుండగానే తల్లి గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Viral Video: దేశంలో నైరుతి రుతుపవనాలతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వరదలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలోనూ కొందరు సరదా కోసం బీచ్లకు వెళుతున్నారు. అలా సరదాగా బీచ్కు వెళ్లిన జంటలో భార్య సముద్ర అలలకు బలి అయింది. తమ కళ్ల ముందే తల్లి సముద్రపు అలలకు కొట్టుకుపోవడాన్ని చూసిన చిన్నారులు తట్టుకోలేక మమ్మీ.. మమ్మీ అంటూ ఏడుస్తున్న ఘటన చూపరులకు సైతం కన్నీరు తెప్పించింది. ఈ ఘటన ముంబయిలో జరిగింది.
Read also: Governor Tamilisai: బోనాల కోసం నాకు ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ రాలేదు..
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
ముంబైలోని రబలేకు చెందిన ముకేశ్, జ్యోతి సోనార్ దంపతులు కలిసి తమ పిల్లలతో గత ఆదివారం జుహు చౌపట్టికి వెళ్లారు. అక్కడ అలల ఉధృతి అధికంగా ఉండటంతో బీచ్లోకి అధికారులు ఎవరినీ అనుమతించలేదు. దీంతో వారు బాంద్రా ఫోర్టుకు చేరుకున్నారు. ఇక భార్యాభర్తలిద్దరూ సరదాగా అలలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రాళ్లపై కూర్చుని అలలను చూస్తున్నారు. ఇంతలో రాకాసి అలలు వచ్చి దంపతులను సముద్రంలోకి లాగేసుకున్నాయి. ఈ క్రమంలో భార్యను కాపాడేందుకు ఆమె చీర పట్టుకుని లాగాడు ముకేశ్. కానీ ఆమె అలల ధాటికి కొట్టుకుపోయింది. ముకేశ్ను స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపులు చేపట్టగా, ఆమె మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. తల్లి జ్యోతి అలల ధాటికి కొట్టుకుపోతున్న సమయంలో వారికి సమీపంలో ఉన్న పిల్లలు మమ్మీ మమ్మీ అంటూ అరిచారు. తమ కళ్ల ముందే తల్లి సముద్రంలోకి కొట్టుకుపోవడాన్ని చూసి ఆ పిల్లలు తల్లడిల్లిపోయారు. జ్యోతి అలలకు కొట్టుకుపోవడంతో ముకేశ్, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తాజావార్తలు
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!