Bengaluru: చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యం.. నిందితుడెవరంటే..!
- టెక్ సిటీ బెంగళూరులో దారుణం
- చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యం
టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. ఒక చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లివ్ ఇన్ పార్ట్నర్గా గుర్తించి అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Yashasvi Jaiswal: అరుదైన మైలురాయికి అడుగు దూరంలో యశస్వి!
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
ఆదివారం బెంగళూరు మున్సిపాలిటీకి చెందిన చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం ప్రత్యక్షమైంది. ట్రక్కులో మృతదేహం కలిగిన గోనె సంచి లభించింది. చేతులు కట్టేసి.. సంచిలో కుక్కేసినట్లుగా కనిపించింది. దీంతో బీబీఎంపీ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి.. మృతురాలు ఆశ (40)గా గుర్తించారు. ఆమెకు మహ్మద్ షంషుద్దీన్ (33) అనే యువకుడితో సంబంధం ఉన్నట్లుగా కనుగొన్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
ఇది కూడా చదవండి: Srisailam: శ్రీశైలం భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన నిలుపుదల
ఏడాదిన్నరగా ఆశ, మహ్మద్ షంషుద్దీన్ సహజీవనం చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మహ్మద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లంతా అస్సాంలో ఉంటున్నారు. ఇక ఆశ వితంతువుగా ఉంది. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. దక్షిణ బెంగళూరులోని హులిమావులో ఇద్దరూ అద్దె ఇంట్లో ఉంటూ భార్యాభర్తలుగా మసులుకుంటున్నారు. ఆశా అర్బన్ కంపెనీలో పనిచేసేది మరియు హౌస్ కీపింగ్ సేవలను అందించేది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. అనంతరం మహ్మద్ షంషుద్దీన్ ఆమె గొంతుకోసి చంపేశాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ బి జగలసర్ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి చెత్త ట్రక్కులో వేశాడని చెప్పారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!