Bengaluru: చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యం.. నిందితుడెవరంటే..!
- టెక్ సిటీ బెంగళూరులో దారుణం
- చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. ఒక చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లివ్ ఇన్ పార్ట్నర్గా గుర్తించి అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Yashasvi Jaiswal: అరుదైన మైలురాయికి అడుగు దూరంలో యశస్వి!
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
ఆదివారం బెంగళూరు మున్సిపాలిటీకి చెందిన చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం ప్రత్యక్షమైంది. ట్రక్కులో మృతదేహం కలిగిన గోనె సంచి లభించింది. చేతులు కట్టేసి.. సంచిలో కుక్కేసినట్లుగా కనిపించింది. దీంతో బీబీఎంపీ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి.. మృతురాలు ఆశ (40)గా గుర్తించారు. ఆమెకు మహ్మద్ షంషుద్దీన్ (33) అనే యువకుడితో సంబంధం ఉన్నట్లుగా కనుగొన్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
ఇది కూడా చదవండి: Srisailam: శ్రీశైలం భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన నిలుపుదల
ఏడాదిన్నరగా ఆశ, మహ్మద్ షంషుద్దీన్ సహజీవనం చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మహ్మద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లంతా అస్సాంలో ఉంటున్నారు. ఇక ఆశ వితంతువుగా ఉంది. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. దక్షిణ బెంగళూరులోని హులిమావులో ఇద్దరూ అద్దె ఇంట్లో ఉంటూ భార్యాభర్తలుగా మసులుకుంటున్నారు. ఆశా అర్బన్ కంపెనీలో పనిచేసేది మరియు హౌస్ కీపింగ్ సేవలను అందించేది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. అనంతరం మహ్మద్ షంషుద్దీన్ ఆమె గొంతుకోసి చంపేశాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ బి జగలసర్ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి చెత్త ట్రక్కులో వేశాడని చెప్పారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!