PM Modi election campaign: 200కి పైగా పబ్లిక్ మీటింగ్స్, 80 ఇంటర్వ్యూలు.. ఎన్నికల ప్రచారంలో మోడీ రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi election campaign: ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. చివరిదైనా ఏడో విడతతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం పూర్తిగా ముగుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి అధికారంలో రావడానికి, బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా కష్టపడ్డారు. ముఖ్యంగా ప్రధాని ఏడు పదుల వయసులో దాదాపుగా ప్రతీ రోజు మూడు నుంచి ఐదు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం సుడిగాలిలా దేశాన్ని చుట్టి వచ్చారు. శనివారం జరగబోతున్న చివరది దశ ఎన్నికల కోసం గురువారం పంజాబ్లోని హోషియార్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని మే 30 నుంచి జూన్ 1 వరకు తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించనునన్నారు. అక్కడ ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్ని సందర్శిస్తారు. మే 30 సాయంత్ర నుంచి జూన్ 1 సాయంత్రం వరకు స్వామి వివేకానంద ఒకప్పుడు ధ్యానం చేసిన ధ్యాన్ మండపంలో ప్రధాని ధ్యానం చేయనున్నారు. గతంలో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని ఆధ్యాత్మిక పర్యటనలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 2019లో కేదార్నాథ్ను సందర్శించిగా, 2014లో శివాజీ ప్రతాప్గఢ్ను సందర్శించారు.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Read Also: Temperature Rise: ఎప్పుడూ లేని విధంగా భారతీయ నగరాలపై భానుడి ప్రతాపం.. కారణం ఏమిటి..?
అయితే, దాదాపుగా 2024 లోక్సభ ఎన్నికల కోసం 75 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రధాని ప్రచారం నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 16న కన్యాకుమారి ప్రచారంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 75 రోజుల వ్యవధిలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో 200 కంటే ఎక్కువ ఎన్నికల ప్రచార సభలు, కార్యక్రమాలకు ప్రధాని హాజరయ్యారు. దీంతో పాటు నేషనల్, ప్రాంతీయ ఛానెళ్లు, మీడియా అనే బేధం లేకుండా 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇదే కాకుండా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మరియు ఒడిశాలో ఎక్కువ రోడ్ షోలు నిర్వహించారు.
ప్రధాని ప్రచారంలో ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ కోటా రిజర్వేషన్లు ప్రముఖ ప్రచారం అస్త్రంగా మారింది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దళితులు, వెనకబడిన వారికి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తుందని ఆయన విస్తృతంగా ఆరోపించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ‘‘సంపద పునర్విభజన’’ అంశంపై ఆ పార్టీపై ప్రధాని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన తల్లులు, సోదరీమణుల మంగళసూత్రాలను లాగేస్తుందని, మన సంపద చొరబాటుదారులకు ఇస్తారని చెప్పారు. ఇక కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, శామ్ పిట్రోడా, ఫరూఖ్ అబ్దుల్లాలు చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీకి ప్రచారానికి పనికొచ్చాయి.
తాజావార్తలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!