NTV Telugu Site icon

Zelensky: త్వరలోనే భారత్‌కు జెలెన్‌స్కీ.. ప్రపంచ శాంతి స్థాపనపై చర్చ..!

Zensjy

Zensjy

Zelensky: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ త్వరలోనే భారతదేశ పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇంకా పర్యటన తేదీలు ఖరారు కానప్పటికీ.. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో పర్యటించే ఛాన్స్ ఉందని ఉక్రెయిన్‌ రాయబారి తెలిపారు. ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. భారత్‌కు రావాలని జెలెన్‌స్కీని ఆహ్వానించారు. నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ ఏడాది చివర్లో ఇక్కడ పర్యటించే చాన్స్ కనిపిస్తుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదో ముందడుగు కానుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనపై చర్చించేందుకు ఈ ఇద్దరు నేతలకు ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని భారత్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌ చుక్ వెల్లడించారు.

Read Also: Arvind Kejriwal: రేపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు..

మరోవైపు, రెండున్నరేళ్లుగా యుద్ధంతో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 23వ తేదీన పర్యటించారు. 1991లో సోవియట్‌ నుంచి విడిపోయి ఉక్రెయిన్‌గా ఏర్పడిన తర్వాత ఓ భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో చర్చలు, దౌత్యమార్గాల్లో ఉక్రెయిన్‌- రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు.. ఇందుకు అన్నివిధాలా కృషి చేస్తామని భారత్‌ భరోసా కల్పిస్తోంది.