AAP: పంజాబ్ సీఎంని మార్చనున్న ఆప్..? భగవంత్ మాన్ ఏం చెప్పారంటే..
- ఢిల్లీ ఓటమితో పంజాబ్పై ప్రభావం..
- ఆప్లో రాజకీయ సంక్షోభం..
- సీఎం మార్పుపై స్పందించిన భగవంత్ మాన్..
AAP: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోర పరాజయం తర్వాత పంజాబ్లో ఆప్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ని మారుస్తారనే చర్చ కొనసాగుతోంది. అయితే, ఈ ఊహాగానాలపై మాన్ నవ్వుతూ స్పందించారు. ఈ రోజు ఢిల్లీలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సమావేశమయ్యారు. ఢిల్లీలోని కపుర్తలా హౌజ్లో జరిగిన పంజాబ్ ఎమ్మెల్యేల సమావేశం రాజకీయ వేడిని పుట్టించింది.
మాన్ని సీఎంగా తొలగించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాడంటూ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. రాజౌరి గార్డెన్ నుంచి కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. భగవంత్ మాన్ సరిగా పనిచేయడం లేదనే ముద్ర వేయడ ద్వారా ఆయనను తొలగిచే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. వైఫల్యాలకు మాన్ని బాధ్యుడిని చేసి, కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలనునకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Also Read
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Read Also: Bird Flu Effect: చికెన్ ప్రియులకు పండగే.. కిలో రూ. 30 మాత్రమే!
అయితే, దీనిపై భగవంత్ మాన్ స్పందిస్తూ.. నవ్వుతూ ‘‘వాళ్లు చెప్పనివ్వండి’’ అని అన్నారు. పంజాబ్లోని 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దాదాపు మూడేళ్లుగా ప్రతాప్ బజ్వా ఇదే మాట చెబుతున్నారని, ఢిల్లీలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యను మూడో సారి లెక్కించండి అంటూ ఎద్దేవా చేశారు. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా స్థానాలు సాధించిందని భగవంత్ మాన్ ఎగతాళి చేశారు.
మేము మా పార్టీని మా రక్తం, చెమటతో నిర్మించామని, నిజానికి కాంగ్రెస్ వారికి మాత్రమే పార్టీలు మారే సంస్కృతి ఉందని చెప్పారు. పంజాబ్ అసెంబ్లీలో 117 మంది సభ్యులు ఉంటే ఆప్ కి 93 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో భాగమని, ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు బాగా పనిచేశారని మాన్ అన్నారు.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!