Bird Flu Effect: చికెన్ ప్రియులకు పండగే.. కిలో రూ. 30 మాత్రమే!
- చికెన్ ప్రియులకు పండగే
- బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ ధరలు ఢమాల్
- కిలో రూ. 30 మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సండే వచ్చిందంటే చాలు చికెన్ ప్రియులకు ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. కొందరైతే ప్రతిరోజు తినడానికి కూడా వెనకాడరు. చికెన్ తో వెరైటీ రెసిపీలు చేసుకుని లాగించేస్తుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు కొండెక్కిన చికెన్ ధరలు నేల చూపుస్తున్నాయి. ఉన్నట్టుండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. చికెన్ కిలో రూ. 30 కే వచ్చేస్తోంది. ఇది తెలిసిన చికెన్ లవర్స్ ఎగిరి గంతులేస్తున్నారు. అయితే చికెన్ ధరలు పడిపోవడానికి గల కారణం ఏంటంటే బర్డ్ ఫ్లూ ప్రభావం. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో డిమాండ్ పూర్తిగా పడిపోయింది.
దీంతో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. అయినా కూడా చికెన్ కొనడానికి.. తినడానికి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్నది. బర్డ్ ఫ్లూ ప్రభావంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు పలువురు. కొనుగోళ్లు తగ్గడంతో చికెన్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్ లకు పంపిచగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యిందని పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. బర్డ్ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించడం, లేదా మానేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
Also Read
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
కోళ్లకు సోకుతున్న HPAI వైరస్ పట్ల కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అనారోగ్యంతో, వైరస్ సోకిన కోళ్లను దూరంగా పూడ్చిపెట్టాలని సూచనలు చేస్తున్నారు. వైరస్ సోకిన కోళ్ల తరలింపులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!