Madhya Pradesh: “నలుపు”గా ఉన్నాడని భర్తను, పసిబిడ్డని విడిచి వెళ్లిన భార్య..
- నల్లగా ఉన్నాడని భర్తను విడిచి వెళ్లిన భార్య..
- నెలన్నర పసికందుని కూడా..
- మధ్యప్రదేశ్లో ఘటన..
- ఎస్పీ ఆఫీసుకు చేరిన భార్యాభర్తల పంచాయతీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: భర్త నలుపురంగులో ఉన్నాడని చెబుతూ ఓ భార్య అతడిని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లింది. భర్తతో పాటు పేగు తెంచుకుని పుట్టిన పసికందుకు కూడా వదిలేసి వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగింది. ప్రస్తుతం ఈ భార్యభర్తల పంచాయతీ ఎస్పీ ఆఫీసుకు చేరింది. భార్యభర్తలు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. భర్త నలుపు రంగులో ఉన్నాడని భార్య చెప్పగా, ఆమె వివాహేతర సంబంధం కారణంగానే తనను వదిలి వెళ్లిందని భర్త ఆరోపించారు.
Read Also: Darshan: దర్శన్ మెడకు రేణుకాస్వామి హత్యకేసు.. పక్కా ఆధారాలు లభ్యం?
Also Read
- BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవని తేలింది. సదరు మహిళ నెలన్నర వయసు ఉన్న తన కుమార్తెని అత్తామామల ఇంట్లో వదిలేసి పుట్టింటికి వెళ్లింది. బాధిత వ్యక్తిని విశాల్ మోగియాగా గుర్తించారు. మంగళవారం గ్వాలియర్లోని ఎస్పీ కార్యాలయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి మహిళా పీఎస్లో డీఎస్పీ కిరణ్ని కలిశారు. పెళ్లి జరిగి ఏడాదైనా, ఇటీవల కూతురు పుట్టినా తన భార్య కుటుంబ సభ్యుల్ని వేధించేదని వెల్లడించారు.
విశాల్ కుటుంబీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం, అతని భార్య చాలాసార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేదని, రైల్వే ట్రాక్పై వెళ్లి ఆత్మహత్ చేసుకుంటానని చెప్పేదని, ఆమెను రక్షించే ప్రయత్నంలో విశాల్ తండ్రికి తీవ్రమైన ప్రమాదం జరిగిందని చెప్పారు. తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉండేందుకు బిడ్డను వదిలేసి వెళ్లిందని విశాల్ ఆరోపించారు. విశాల్ కుటుంబం ఆమె తిరిగి రావడం లేదా శాంతియుతంగా విడిపోవాలని కోరుకుంటున్నారు. తన కొడుకు నల్లగా ఉన్నాడని తన కోడలు అతనితో ఉండేందుకు ఇష్టపడలేదని విశాల్ తల్లి చెప్పింది. మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, పరిస్థితిని సమర్థవంతంగా పరిష్కరించడానికి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ సెషన్లు త్వరలో ప్రారంభిస్తామని డీఎస్పీ కిరణ్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!