Madhya Pradesh: “నలుపు”గా ఉన్నాడని భర్తను, పసిబిడ్డని విడిచి వెళ్లిన భార్య..
- నల్లగా ఉన్నాడని భర్తను విడిచి వెళ్లిన భార్య..
- నెలన్నర పసికందుని కూడా..
- మధ్యప్రదేశ్లో ఘటన..
- ఎస్పీ ఆఫీసుకు చేరిన భార్యాభర్తల పంచాయతీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: భర్త నలుపురంగులో ఉన్నాడని చెబుతూ ఓ భార్య అతడిని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లింది. భర్తతో పాటు పేగు తెంచుకుని పుట్టిన పసికందుకు కూడా వదిలేసి వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగింది. ప్రస్తుతం ఈ భార్యభర్తల పంచాయతీ ఎస్పీ ఆఫీసుకు చేరింది. భార్యభర్తలు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. భర్త నలుపు రంగులో ఉన్నాడని భార్య చెప్పగా, ఆమె వివాహేతర సంబంధం కారణంగానే తనను వదిలి వెళ్లిందని భర్త ఆరోపించారు.
Read Also: Darshan: దర్శన్ మెడకు రేణుకాస్వామి హత్యకేసు.. పక్కా ఆధారాలు లభ్యం?
Also Read
- ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
- Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవని తేలింది. సదరు మహిళ నెలన్నర వయసు ఉన్న తన కుమార్తెని అత్తామామల ఇంట్లో వదిలేసి పుట్టింటికి వెళ్లింది. బాధిత వ్యక్తిని విశాల్ మోగియాగా గుర్తించారు. మంగళవారం గ్వాలియర్లోని ఎస్పీ కార్యాలయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి మహిళా పీఎస్లో డీఎస్పీ కిరణ్ని కలిశారు. పెళ్లి జరిగి ఏడాదైనా, ఇటీవల కూతురు పుట్టినా తన భార్య కుటుంబ సభ్యుల్ని వేధించేదని వెల్లడించారు.
విశాల్ కుటుంబీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం, అతని భార్య చాలాసార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేదని, రైల్వే ట్రాక్పై వెళ్లి ఆత్మహత్ చేసుకుంటానని చెప్పేదని, ఆమెను రక్షించే ప్రయత్నంలో విశాల్ తండ్రికి తీవ్రమైన ప్రమాదం జరిగిందని చెప్పారు. తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉండేందుకు బిడ్డను వదిలేసి వెళ్లిందని విశాల్ ఆరోపించారు. విశాల్ కుటుంబం ఆమె తిరిగి రావడం లేదా శాంతియుతంగా విడిపోవాలని కోరుకుంటున్నారు. తన కొడుకు నల్లగా ఉన్నాడని తన కోడలు అతనితో ఉండేందుకు ఇష్టపడలేదని విశాల్ తల్లి చెప్పింది. మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, పరిస్థితిని సమర్థవంతంగా పరిష్కరించడానికి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ సెషన్లు త్వరలో ప్రారంభిస్తామని డీఎస్పీ కిరణ్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోన్? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
-
ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ ప్రక్షాళన!
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!