Darshan: దర్శన్ మెడకు రేణుకాస్వామి హత్యకేసు.. పక్కా ఆధారాలు లభ్యం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
More Than 10 Accused Fingerprint Matches in Renukaswamy Murder Case: రేణుకా స్వామి హత్య కేసు ఇప్పుడు బలపడింది. నిందితులు మరింత కష్టాలను ఎదుర్కొనాల్సి రావచ్చు. నేరం జరిగిన ప్రదేశంలో లభించిన వేలిముద్రలు నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అండ్ కో ప్రమేయం ఉంది. ఈ కేసులో రెండో నిందితుడు దర్శన్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడు. మొదటి నిందితురాలు పవిత్ర గౌడ సహా నిందితులందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 13 మంది నిందితులు పరప్పన అగ్రహార జైలులో ఉండగా, నలుగురు నిందితులు తుమకూరు జైలులో ఉన్నారు. రోజురోజుకు ఈ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పుడు రేణుకా స్వామి హత్య కేసు మరింత బలపడింది. నిందితుల వేలిముద్ర సరిపోలినట్లు సమాచారం. రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నుంచి నివేదిక వచ్చింది. నివేదికలో షాకింగ్ అంశాలున్నాయని, నిందితుల వేలిముద్రలు నిర్ధారణ అయ్యాయని చెబుతున్నారు.
Sanjana: అర్థరాత్రి వీఐపీ కొడుకు అసభ్యకరమైన మెసేజులు.. సంజన సంచలన వ్యాఖ్యలు
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
రేణుకాస్వామి హత్యకు గురైన స్థలం, మృతదేహాన్ని తరలించిన వాహనం, స్వాధీనం చేసుకున్న వాహనాలతో పాటు పలు ప్రాంతాల్లో వేలిముద్రలు సేకరించారు. ఈ వేలిముద్రలు నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. పది మందికి పైగా నిందితుల వేలిముద్రలు సరిపోలినట్లు సమాచారం. దాడి జరిగిన నిర్దిష్ట ప్రదేశాలు, హత్య జరిగిన ప్రదేశం, మృతదేహాన్ని తరలించిన వాహనం, మృతదేహాన్ని పడేసిన ప్రదేశం, మృతదేహంపై బట్టలు, వివిధ ప్రాంతాల నుండి వేలిముద్రలు సేకరించారు. దాడిలో ఉపయోగించిన వస్తువులు, చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని తీసుకెళ్లిన వాహనం, నిందితుల ఇళ్లలోనూ వేలిముద్రలు సేకరించారు. వీటన్నింటిని నిందితుల వేలిముద్రల నమూనాలతో పాటు బెంగళూరు, హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ కేంద్రాలకు పంపించారు. ప్రస్తుతం రెండు కేంద్రాల నుంచి నివేదిక రాగా, నేరం జరిగిన ప్రదేశంలో లభించిన వేలిముద్రలు, పది మందికి పైగా నిందితుల వేలిముద్రలతో సరిపోలినట్లు తెలుస్తోంది. 10 మందికి పైగా నిందితుల వేలిముద్రలు సరిపోలినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దర్శన్, పవిత్ర గౌడ వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయా లేదా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!