Rahul Gandhi: రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె విమర్శలు..
- రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై మరోసారి వివాదం..
- మన్మోహన్ సింగ్ చనిపోయిన వెంటనే ఎందుకు వెళ్లారు..?
- ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన తర్వాత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటకు వెళ్లడంపై బీజేపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మాజీ రాష్ట్రపతి, దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ కూడా రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలు చేశారు. దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయి ఉంటే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ టూర్కి వెళ్లడాన్ని ప్రశ్నించారు.
‘‘దేశంలో ఒక సాధారణ పౌరుడిగా రాహుల్ గాంధీని ప్రశ్నించాలని అనుకుంటున్నాను. తన సొంత పార్టీకి చెందిన ఒక ప్రధాని మరణానికి దేశం సంతాపం వ్యక్తం చేస్తున్నప్పుడు అతను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వేరే ప్రాంతానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? ఎందుకు వేచి ఉండలేకపోయారు..?’’ అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
Read Also: PM Modi: విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ.. స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్కల్యాణ్
షర్మిష్ట ముఖర్జీ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ అంత్యక్రియాలు నిర్వహించిన మరుసటి రోజు ఆయన చితాభస్మాన్ని సేకరించే కార్యక్రమానికి ఒక్క కాంగ్రెస్ నేత రాలేదని వార్తా కథనాల్లో చూశానని అన్నారు. మాజీ ప్రధాని చనిపోతే పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయమని, ప్రణబ్ ముఖర్జీ చనిపోయిన తర్వాత పార్టీ నేతల నుంచి వ్యక్తిగతంగా సానుభూతి పొందానని ఆమె చెప్పారు. కోవిడ్-9 సమయంలో చాలా మంది రాలేకపోయారు, అయితే ఇప్పుడు కోవిడ్ లేదు, రాహుల్ గాంధీ ఎందుకు వెళ్లారు..? అని ఆమె అడిగారు.
గత వారం రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీ కూడా విమర్శలు గుప్పించింది. “ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి దేశం సంతాపం వ్యక్తం చేస్తుంటే, రాహుల్ గాంధీ కొత్త సంవత్సరం కోసం వియత్నాంకు వెళ్లారు. రాహుల్ గాంధీ ఆయన మరణాన్ని రాజకీయం కోసం వాడుకున్నాడు.’’ అని విమర్శించింది. గాంధీలకు, కాంగ్రెస్కి సిక్కులు అంటే ద్వేషమని బీజేపీ ధ్వజమెత్తింది. ఇందిరా గాంధీ దర్బార్ సాహిబ్ని అపవిత్రం చేసిందని ఎప్పటికీ మరచిపోవద్దని బీజేపీ గుర్తు చేసింది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!