Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎవరు..? నేడు మహాయుతి కీలక సమావేశాలు..
- మహారాష్ట్రలో ‘‘మహాయుతి’’ ఘన విజయం..
- సీఎం సీటుపై కొనసాగుతున్న సస్పెన్స్..
- బీజేపీ, షిండే, అజిత్ పవార్ సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మహాయుతి కూటమిలో బీజేపీ ఏకంగా 132 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ కూటమి దాటికి ప్రతిపక్షంలోని కాంగ్రెస్, ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
Read Also: Space Out Competition: 90 నిమిషాలపాటు ‘ఏమి చేయవద్దు’.. బహుమతి గెలుచుకోండి
Also Read
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందా..? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మహాయుతిలోని మూడు పార్టీలు కూడా తమ తమ శాసనసభా పక్ష నేతలను ఎన్నుకుంటున్నాయి. మూడు పార్టీలు కూడా వేర్వేరుగా సమావేశమయ్యాయి. ముంబైలోని తన అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. ముంబైలోని దేవేంద్ర ఫడ్నవీస్ అధికారిక నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుండగా, బాంద్రాలోని ఓ హోటల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ఏక్నాథ్ షిండే సమావేశమయ్యారు.
ఈ ప్రత్యేక పార్టీ సమావేశాల తర్వాత, సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపికపై చర్చించడానికి మహాయుతి ఎమ్మెల్యేలంతా కూటమిగా సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా సీఎం పోస్టుని ఆశిస్తున్నారు. ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి పదవికి నిర్ణంయ తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. 10 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన ముంబైలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం నవంబర్ 26న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.
తాజావార్తలు
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా..?
-
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!