Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎవరు..? నేడు మహాయుతి కీలక సమావేశాలు..
- మహారాష్ట్రలో ‘‘మహాయుతి’’ ఘన విజయం..
- సీఎం సీటుపై కొనసాగుతున్న సస్పెన్స్..
- బీజేపీ, షిండే, అజిత్ పవార్ సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మహాయుతి కూటమిలో బీజేపీ ఏకంగా 132 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ కూటమి దాటికి ప్రతిపక్షంలోని కాంగ్రెస్, ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
Read Also: Space Out Competition: 90 నిమిషాలపాటు ‘ఏమి చేయవద్దు’.. బహుమతి గెలుచుకోండి
Also Read
- India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
- Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన 'గోల్డెన్' స్కెచ్!
- Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
- Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందా..? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మహాయుతిలోని మూడు పార్టీలు కూడా తమ తమ శాసనసభా పక్ష నేతలను ఎన్నుకుంటున్నాయి. మూడు పార్టీలు కూడా వేర్వేరుగా సమావేశమయ్యాయి. ముంబైలోని తన అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. ముంబైలోని దేవేంద్ర ఫడ్నవీస్ అధికారిక నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుండగా, బాంద్రాలోని ఓ హోటల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ఏక్నాథ్ షిండే సమావేశమయ్యారు.
ఈ ప్రత్యేక పార్టీ సమావేశాల తర్వాత, సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపికపై చర్చించడానికి మహాయుతి ఎమ్మెల్యేలంతా కూటమిగా సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా సీఎం పోస్టుని ఆశిస్తున్నారు. ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి పదవికి నిర్ణంయ తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. 10 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన ముంబైలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం నవంబర్ 26న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.
తాజావార్తలు
-
ఫిఫా వరల్డ్కప్లో భారీ షాక్.. Cristiano Ronaldo ప్రభావం శూన్యం.. పోర్చుగల్ విజయాన్ని అడ్డుకున్న కాంగో.!
-
Haier HQLED P7 Pro Smart TV: భారత్ లో హైయర్ కొత్త HQLED P7 ప్రో స్మార్ట్ టీవీ సిరీస్ విడుదల.. ప్రీమియం ఫీచర్లు
-
Team India: బ్లూ జెర్సీ జోరు.. ఒకే రోజులో ట్రిపుల్ విక్టరీతో భారత్ సంచలనం.!
-
Gurnoor Brar: భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన కొత్త పేస్ సంచలనం.. ఏకంగా బుమ్రా సరసన నిలిచిన కుర్రాడు!
-
Thursday Astrology: గురువారం దిన ఫలాలు.. వాగ్దానాలు, హామీలు అస్సలు ఇవ్వకండి!
ట్రెండింగ్
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!