Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎవరు..? నేడు మహాయుతి కీలక సమావేశాలు..
- మహారాష్ట్రలో ‘‘మహాయుతి’’ ఘన విజయం..
- సీఎం సీటుపై కొనసాగుతున్న సస్పెన్స్..
- బీజేపీ, షిండే, అజిత్ పవార్ సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మహాయుతి కూటమిలో బీజేపీ ఏకంగా 132 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ కూటమి దాటికి ప్రతిపక్షంలోని కాంగ్రెస్, ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
Read Also: Space Out Competition: 90 నిమిషాలపాటు ‘ఏమి చేయవద్దు’.. బహుమతి గెలుచుకోండి
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందా..? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మహాయుతిలోని మూడు పార్టీలు కూడా తమ తమ శాసనసభా పక్ష నేతలను ఎన్నుకుంటున్నాయి. మూడు పార్టీలు కూడా వేర్వేరుగా సమావేశమయ్యాయి. ముంబైలోని తన అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. ముంబైలోని దేవేంద్ర ఫడ్నవీస్ అధికారిక నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుండగా, బాంద్రాలోని ఓ హోటల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ఏక్నాథ్ షిండే సమావేశమయ్యారు.
ఈ ప్రత్యేక పార్టీ సమావేశాల తర్వాత, సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపికపై చర్చించడానికి మహాయుతి ఎమ్మెల్యేలంతా కూటమిగా సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా సీఎం పోస్టుని ఆశిస్తున్నారు. ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి పదవికి నిర్ణంయ తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. 10 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన ముంబైలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం నవంబర్ 26న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!