Elections Results 2024: అంతిమ తీర్పు.. బీజేపీ 400 సాధిస్తుందా..? ఇండియా కూటమి గెలుస్తుందా..?
Elections Results 2024: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న రోజు రానే వచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఏడు విడతల జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దేశంలోని మొత్తం 543 స్థానాల్లో 8360 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరి భవితవ్యం ఈ రోజుతో తేలిపోనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఈ సారి కూడా అధికారంలోకి వస్తుందని, 350కి పైగా సీట్ల సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తుండగా, ఇండియా కూటమి తామే అధికారంలోకి వస్తామని, ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయని, తాము 295 సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. బీజేపీ స్వయంగా 370కి పైగా స్థానాలను, ఎన్డీయే కూటమి 400+ స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ ఎన్నికల ముందు నుంచి చెబుతోంది.
Read Also: Loksabha Elections : 20 ఏళ్ల తర్వాత రాయ్బరేలీకి కొత్త ఎంపీ.. రాహుల్, దినేష్ ప్రతాప్ మధ్య గట్టి పోటీ
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన అరగంట తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్లో 5 దశల్లో పోలింగ్ జరగగా, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరిగింది. కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ఛత్తీస్గఢ్, అస్సాంలో 3 దశల్లో, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో 4 దశల్లో పోలింగ్ జరిగింది. ఆరు జాతీయ పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా 744 పార్టీల నుంచి 8360 మంది అభ్యర్థులు 543 లోక్సభ స్థానాల్లో పోటీ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!