* కర్ణాటకలో కొనసాగుతోన్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
* నేడు హైదరాబాద్కు మల్లికార్జున ఖర్గే.. ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో పార్టీ నేతలతో సమావేశం
* ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం.. నిపుణుల అభిప్రాయాలు సేకరించనున్న ఐక్య కార్యాచరణ కమిటీ
* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. గోగర్బం డ్యాం వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం
* విశాఖ: వికేంద్రీకరణ పోరాటం కోసం నాన్ పొలిటి
కల్ జేఏసీ ఏర్పాటు.. నేడు తొలి సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటన.. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్, పరిపాలన వికేంద్రీకరణ మద్దతుగా పోరాటం
* విజయవాడ: రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా నేటి నుంచి పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసిన అధికారులు.. విజయవాడ-బిట్రుగుంట, విజయవాడ – ఒంగోలు, విజయవాడ-గూడూరు మధ్య నడిచే రైళ్లు రద్దు
* గుంటూరు: నేడు పెదకాకానిలో పర్యటించనున్న తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య… మానవ హక్కులపై అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రయ్య.
* గుంటూరు : నేడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవం… హాజరుకానున్న ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్.
* హైదరాబాద్: నేడు బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జ్ల భేటీ.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన జరగనున్న సమావేశం.. హాజరుకానున్న తరుణ్చుగ్, సునీల్ బన్సల్.. మునుగోడు ఉప ఎన్నిక, తాజా రాజకీయాలపై చర్చ
